HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tpcc Chief Revanth Reddy Invite Leaders Who Left Congress Party

Telangana Politics: కాంగ్రెస్ వీడిన వాళ్లంతా వెనక్కి తిరిగి రావాలి: రేవంత్

కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి, బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని కోరారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కోసం, కెసిఆర్ ని గద్దె దించడం కోసం అవసరమైతే తాను ఒక మెట్టు కిందకు దిగేందుకు సిద్ధమని తెలిపారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

  • Author : Praveen Aluthuru Date : 18-05-2023 - 6:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Politics
Telangana Politics

Telangana Politics: కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి, బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని కోరారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కోసం, కెసిఆర్ ని గద్దె దించడం కోసం అవసరమైతే తాను ఒక మెట్టు కిందకు దిగేందుకు సిద్ధమని తెలిపారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత దేశ రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఆ పార్టీ నేతలకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. కాగా కర్ణాటక ఫలితాలు తెలంగాలోను రిపీట్ అవ్వబోతున్నట్టు కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ పవనాలు వీస్తున్నట్టు కనిపిస్తుంది. కర్ణాటకలో బీజేపీ ఓటమితో తెలంగాణాలో బీజేపీ నేతలు సైలెంట్ అయిపోయారు. అటు సీఎం కెసిఆర్ సైతం కాసింత వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో, మంత్రులతో అత్యవసర భేటీలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని, తెలంగాణాలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు గురువారం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో అనేక విషయాలపై మాట్లాడారు. కర్ణాటక రిజల్ట్స్ చూసి కెసిఆర్ వణికిపోతున్నారని అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ రెండు ఒకటేనని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడిన మాటలు, కెసిఆర్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ఇద్దరు ఒకే గూటి పక్షులు అంటూ విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన అందరూ తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని వేడుకున్నారు. ఈ విషయంలో తాను ఒక మెట్టు దిగేందుకు రెడీ అన్నారు. నాతో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సీనియర్లతో మాట్లాడుకోవాలని రేవంత్ ఈ సందర్భంగా తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నాది కాదని, నేను ఖర్గే నాయకత్వలో పని చేస్తున్నాని రేవంత్ అన్నారు. కెసిఆర్ ని ఓడించడం బీజేపీ వల్ల కాదని, కెసిఆర్ ని గద్దె దించడం కాంగ్రెస్ మాత్రమే చేయగలదని రేవంత్ తెలిపారు. ఈటెల రాజేందర్, రాజగోపాల్, మాజీ ఎంపీ విశ్వేశరరెడ్డి , వివేకా బీజేపీ లోకి వెళ్లినప్పటికీ వాళ్ళని బీజేపీ నమ్మే పరిస్థితుల్లో లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వీళ్ళు కూడా బీజేపీని నమ్మరంటూ వ్యాఖ్యానించారు. దేశానికి, తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని నొక్కి చెప్పారు. సోనియా గాంధీ కాంగ్రెస్ ఇవ్వకపోతే కెసిఆర్, ఆయన కుటుంబం రోడ్డు మీద భిక్షమెత్తుకునేది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు రేవంత్. కెసిఆర్ ఇప్పుడు అవతరణ వేడుకలు చేస్తున్నారని, అయితే కెసిఆర్ కు ఇవే చివరి వేడుకలు అని, వచ్చే అవతరణ వేడుకలను జరిపించేది తెలంగాణ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

Read More: Mohammed Siraj Dream: టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ కొత్త ఇల్లును చూశారా!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • congress
  • Karnataka Results
  • kcr
  • revanth reddy
  • telangana politics

Related News

Kalvakuntla Kavitha New Party in April

Kavitha New Party: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత

Kalvakuntla Kavitha  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Teenmaar Mallanna Padayatra

    Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న పాదయాత్ర

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • Harish Rao Kanchukota

    Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?

Latest News

  • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

  • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

  • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

  • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

  • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd