CM KCR: 1956లో ఆంధ్రాలో తెలంగాణ విలీనానికి కారణం కాంగ్రెస్సే
కాంగ్రెస్ పార్టీకి కనీసం డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని అవహేళన చేశారు సీఎం కేసీఆర్. రానున్న ఎన్నికల్లో హామీలను నెరవేర్చే పార్టీకి ఓటు వేయాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు.హుజురానగర్ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
- Author : Praveen Aluthuru
Date : 31-10-2023 - 7:02 IST
Published By : Hashtagu Telugu Desk
CM KCR: కాంగ్రెస్ పార్టీకి కనీసం డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని అవహేళన చేశారు సీఎం కేసీఆర్. రానున్న ఎన్నికల్లో హామీలను నెరవేర్చే పార్టీకి ఓటు వేయాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు.హుజురానగర్ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
సీఎం కెసిఆర్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరిన కేసీఆర్ , కాంగ్రెస్ నేతలు తమ పదవులు, కాంట్రాక్టులపై ఆసక్తి చూపుతారని, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల గురించి ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు.ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి అభ్యర్థులే. ఒకరు సీఎం కావాలనుకుంటే.. మరికొందరు కిందకు లాగుతున్నారు. ఎన్నికలొస్తే సీఎం అవుతానని ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు.
ధరణిని రద్దు చేయాలని రాహుల్ గాంధీ నుంచి తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వరకు ప్రతిఒక్కరు చెబుతున్నారని. ధరణి లేకపోతే రైతులు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే ధరణి తీసుకొచ్చామని సీఎం అన్నారు. ధరణి అనేది తెలంగాణలో మా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ పోర్టల్ అన్నారు.
గతంలో అనేక ఎన్నికలను చూసి ఓటు వేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడే ప్రజలు గెలుస్తారు లేకపోతే నాయకులు గెలుస్తారు. ప్రజలు గెలిచే ఎన్నికలే నిజమైన ఎన్నికలు. అప్పుడే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్ పథకాలు, రైతుబంధు కింద దశలవారీగా మొత్తాలను పెంచుతామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి, రైతులకు ఇచ్చిన ప్రోత్సాహం ఫలితంగా తెలంగాణ ఏడాదికి మూడు కోట్ల టన్నుల వరి ఉత్పత్తి చేయగలిగిందని, దేశంలో పంజాబ్ తర్వాత రెండవ స్థానంలో ఉందని కేసీఆర్ చెప్పారు.
1956లో తెలంగాణను ఆంధ్రాలో విలీనానికి ఒప్పుకున్నది తెలంగాణ కాంగ్రెస్ నేతలేనని ఆరోపించారు.సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడికి కాంగ్రెస్ పార్టీయే కారణమని సీఎం కేసీఆర్ ఆరోపించారు . దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని అక్టోబర్ 30న ఎన్నికల ప్రచారంలో38 ఏళ్ల వ్యక్తి కత్తితో పొడిచిన విషయం తెలిసిందే.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే గడ్డం తీసుకోను అని శపథం చేస్తడు. ఆయన గడ్డం తీసుకుంటే ఎంత.. తీసుకోకపోతే ఎంత..? నీ శపథాలు కాదు.. పని కావాలి. నీళ్లు,… pic.twitter.com/9ZVSqFEHfX
— BRS Party (@BRSparty) October 31, 2023
Also Read: KTR: దేశాన్ని నిరుద్యోగ భారతంగా తయారుచేసిందే బీజేపీ- మంత్రి కేటీఆర్