HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Mlas Disqualification Case Supreme Court Hearing Postponed

Supreme Court : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌.. మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రీజనబుల్ టైమ్ విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పది నెలలు గడిచినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. తదనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.

  • Author : Kavya Krishna Date : 10-02-2025 - 1:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supreme Court notices to MLAs who defected from the party
Supreme Court notices to MLAs who defected from the party

Supreme Court : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావు సహా పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే, విచారణలో కీలకంగా నిలిచిన ‘రీజనబుల్ టైమ్’ అంశంపై సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పది నెలల సమయాన్ని రీజనబుల్ టైమ్‌గా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ కేసు విచారణ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎదుట జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మరోవైపు బీఆర్‌ఎస్ తరఫున ఆర్యంనామసుందరం వాదనలు జరిపారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కూడా కోర్టు ఎదుట హాజరయ్యారు. వివాదానికి కేంద్రంగా మారిన ‘రీజనబుల్ టైమ్’పై కోర్టు తీవ్రంగా స్పందించింది. “పది నెలలు రీజనబుల్ టైమ్ కాదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టంగా కనిపిస్తోంది,” అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో, ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.

JELLY : మీ పిల్లలు ‘జెల్లీ’ని ఇష్టాంగా తింటున్నారా..? అయితే ప్రమాదంలో పడినట్లే.!!

బీఆర్‌ఎస్ వరుసగా పిటిషన్లు దాఖలు
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ తరచూ పిటిషన్లు వేస్తూ వస్తోంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్‌లు మొదటగా కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌లో మొదట ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు మాత్రమే ఉండగా, ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో మరో ఏడుగురి పేర్లను చేర్చారు. దీంతో మొత్తం పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది.

ఈ రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఏకీకృతంగా విచారిస్తోంది. పిటిషన్లు దాఖలైనప్పటి నుంచి కేసు ఆలస్యంగా ముందుకు సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ స్పీకర్ ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రాథమికంగా కీలక వ్యాఖ్యలు చేసింది.  “పది నెలలు అనేది రీజనబుల్ టైమ్ కాదు” అని కోర్టు తేల్చి చెప్పింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోర్టు స్పీకర్‌కు సూచించవచ్చని న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేసు ఆలస్యం కావడం వెనుక ప్రభుత్వ యాజమాన్యానికి ఉన్న ప్రయోజనాలపై కోర్టు ప్రశ్నలు వేసే అవకాశముందని భావిస్తున్నారు.

 

18న కీలక విచారణ
ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టులో జరిగే తదుపరి విచారణ అత్యంత కీలకంగా మారనుంది. ఈ విచారణలో సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసు తదుపరి మలుపు ఏదైనా నడిచినా, తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Jagan : జగన్ ఇంటివద్ద పోలీస్ సెక్యూరిటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aryama Sundaram
  • brs
  • congress
  • Disqualification Case
  • ktr
  • mukul rohatgi
  • Supreme Court
  • telangana
  • telangana politics

Related News

Maoists Khali

తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మావోయిస్టు అనే పదం ఇక వినలేం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో శతాబ్దాలుగా మావోయిస్టులు దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ , ప్రస్తుతం మాత్రం మావోయిస్టులంతా లొంగిపోతున్నారు. దీనికి కారణం అగ్ర మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోవడం , మరోపక్క కీలక నేతలు లొంగిపోతుండడం తో మిగతా మావోలంతా లొంగిపోతున్నారు.

  • Kavitha Bc Bandh

    కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • Sc Revanth

    సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • Congress ranks call for movement in wake of National Herald case

    నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

Latest News

  • MGNREGA పథకం మార్పు పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

  • అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!

  • టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్‌ కోచ్‌ కాదు!

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం

  • ఛాంపియన్ స్టోరీ ఇదే !!

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd