HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Mlas Disqualification Case Supreme Court Hearing Postponed

Supreme Court : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌.. మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రీజనబుల్ టైమ్ విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పది నెలలు గడిచినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. తదనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.

  • Author : Kavya Krishna Date : 10-02-2025 - 1:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supreme Court notices to MLAs who defected from the party
Supreme Court notices to MLAs who defected from the party

Supreme Court : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావు సహా పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే, విచారణలో కీలకంగా నిలిచిన ‘రీజనబుల్ టైమ్’ అంశంపై సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పది నెలల సమయాన్ని రీజనబుల్ టైమ్‌గా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ కేసు విచారణ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎదుట జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మరోవైపు బీఆర్‌ఎస్ తరఫున ఆర్యంనామసుందరం వాదనలు జరిపారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కూడా కోర్టు ఎదుట హాజరయ్యారు. వివాదానికి కేంద్రంగా మారిన ‘రీజనబుల్ టైమ్’పై కోర్టు తీవ్రంగా స్పందించింది. “పది నెలలు రీజనబుల్ టైమ్ కాదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టంగా కనిపిస్తోంది,” అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో, ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.

JELLY : మీ పిల్లలు ‘జెల్లీ’ని ఇష్టాంగా తింటున్నారా..? అయితే ప్రమాదంలో పడినట్లే.!!

బీఆర్‌ఎస్ వరుసగా పిటిషన్లు దాఖలు
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ తరచూ పిటిషన్లు వేస్తూ వస్తోంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్‌లు మొదటగా కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌లో మొదట ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు మాత్రమే ఉండగా, ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో మరో ఏడుగురి పేర్లను చేర్చారు. దీంతో మొత్తం పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది.

ఈ రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఏకీకృతంగా విచారిస్తోంది. పిటిషన్లు దాఖలైనప్పటి నుంచి కేసు ఆలస్యంగా ముందుకు సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ స్పీకర్ ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రాథమికంగా కీలక వ్యాఖ్యలు చేసింది.  “పది నెలలు అనేది రీజనబుల్ టైమ్ కాదు” అని కోర్టు తేల్చి చెప్పింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోర్టు స్పీకర్‌కు సూచించవచ్చని న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేసు ఆలస్యం కావడం వెనుక ప్రభుత్వ యాజమాన్యానికి ఉన్న ప్రయోజనాలపై కోర్టు ప్రశ్నలు వేసే అవకాశముందని భావిస్తున్నారు.

 

18న కీలక విచారణ
ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టులో జరిగే తదుపరి విచారణ అత్యంత కీలకంగా మారనుంది. ఈ విచారణలో సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసు తదుపరి మలుపు ఏదైనా నడిచినా, తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Jagan : జగన్ ఇంటివద్ద పోలీస్ సెక్యూరిటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aryama Sundaram
  • brs
  • congress
  • Disqualification Case
  • ktr
  • mukul rohatgi
  • Supreme Court
  • telangana
  • telangana politics

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

  • Kavitha warns the Congress government.

    Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

  • CM Revanth Reddy issues a strong warning to KTR.

    Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd