Telangana: నేత కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. నేతన్నలకు 50 కోట్లు విడుదల
నేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు.రంజాన-సిరిసిల్ల జిల్లాలోని పవర్ లూమ్ నేత కార్మికుల పెండింగ్ బిల్లుల కోసం రూ.50 కోట్లు విడుదల చేశారు.
- Author : Praveen Aluthuru
Date : 19-04-2024 - 11:37 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: నేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోని పవర్ లూమ్ నేత కార్మికుల పెండింగ్ బిల్లుల కోసం రూ.50 కోట్లు విడుదల చేశారు. బతుకమ్మ చీరల బకాయిల పెండింగ్తో పాటు రూ.18 కోట్ల సబ్సిడీ, నేత కార్మికుల పొదుపు మ్యాచింగ్ గ్రాంట్, విద్యుత్ సబ్సిడీ బిల్లులు పెండింగ్లో ఉన్నందున ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి బిల్లుల మొత్తాన్ని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లకు చెందిన నేత కార్మికులు 48 రోజులుగా నిరసనలు చేపట్టారు. ఇటీవల బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో సమావేశమై తమ సమస్యలపై చర్చించారు. నూలు సబ్సిడీ, ఇతర బకాయిలను కొద్ది రోజుల్లోనే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, బట్టల తయారీకి ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందని పొన్నం ప్రభాకర్ సిరిసిల్లలో ప్రకటించారు. ఆయన హామీ మేరకు చేనేత కార్మికులు ఏప్రిల్ 10 నుంచి పవర్ లూమ్లను నడపాలని నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join
చేనేత కార్మికుల వినతులపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పెండింగ్లో ఉన్న రూ.50 కోట్ల బిల్లులను విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించగా, మిగిలిన పెండింగ్ బిల్లులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Asaduddin Owaisi Assets: అసదుద్దీన్ ఒవైసీ ఆస్తి వివరాలు.. సొంత కారు లేదట