HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Governments Key Decision They Are All Government Employees

TS Govt Key Decision: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం…సెప్టెంబర్ నుంచి వారంతా ప్రభుత్వ ఉద్యోగులే..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా ఉన్న విలేజ్ రెవెన్యూ సహాయకులను...ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు రంగం సిద్ధం చేసింది.

  • Author : hashtagu Date : 28-08-2022 - 10:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Government Of Telangana Logo
Government Of Telangana Logo

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా ఉన్న విలేజ్ రెవెన్యూ సహాయకులను…ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి కమిటీ తమ రిపోర్టును ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించినట్లుగా సమాచారం. ఈ కమిటీకి శేషాద్రి నేతృత్వం వహించారు. వీరిని సెప్టెంబర్ మొదటి వారంలోగా క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21వేల మంది VRAలు ఉండగా….పదోతరగతి, ఆపైన విద్యార్హత ఉన్న 9వేల మందికి మాత్రమే ఈ పదోన్నతులు దక్కనున్నట్లు సమాచారం. కాగా రెండేళ్ల కిందే వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తామని సర్కార్ చెప్పినా…ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఈ వ్యవహారంపై కదలిక మొదలు అయ్యింది. 33 జిల్లాల వారిగా సీసీఎల్ఏ ప్రాధమిక సమాచారాన్ని సేకరించింది.

ఈ క్రమబద్దీకరణ ప్రకారం వీఆర్ఏలకు పేస్కేలు చెల్లిస్తారు. కానీ ఇప్పటి వరకు వేతన వివరాలు ఖరారు కాలేదని రెవెన్యూ శాఖ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 23,046మంది వీఆర్ఏలు ఉన్నారు. వారిలో 21,433మంది విధుల్లో ఉన్నారు. టెన్త్ చదివినవారు 3,756కాగా…ఇంటర్ 2,343,డిగ్రీ 1951, పీజీ 858 మంది ఉన్నారు. 9వ తరగతి వరకు చదవినవారు 7,200మంది ఉన్నారు.

విద్యార్హత లేని వారు 5,226 మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. టెన్త్ చదివినవారికి వెంటనే పదోన్నతులు కల్పించే యోచనలో ప్రభుత్వం ఉంది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా వీరిని ధరణి ఆపరేటర్లుగా నియమించనున్నారు. కొందరిని నీటిపారుదల రంగంలో, ఇంకొందరిని తహసీల్దారు కార్యాలయంలో సర్దుబాటు చేసే అవకాశం ఉంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jobs
  • Latest News
  • telangana government
  • ts
  • vra

Related News

Territorial Army Recruitment

మాజీ సైనికులకు గుడ్ న్యూస్‌!

ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే అభ్యర్థులు మాజీ సైనికులు, రిటైర్డ్ ఉద్యోగులు లేదా సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారై ఉండాలి.

  • Telangana Dialysis Centres

    తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు

Latest News

  • KMB : కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఈజీ గా రుణాలు తీసుకోవచ్చు..ఎలాగంటే !!

  • Gold : స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా బంగారం మీ చేతికే!!

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Trending News

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd