HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Telangana Government Plans To Purchase Paddy From Farmers And Sell Through E Auction

Paddy E-Auction : వడ్ల కొనుగోలుపై తెలంగాణ సర్కారు ఆగమాగం.. కొత్త ప్లాన్ ఏంటో తెలుసా?

వడ్ల కొనుగోలు అంశం.. బీజేపీతో పాటు టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ మొదటివారంలోపు కోతలు పూర్తయితే ఆ పంటంతా మార్కెట్ కు వచ్చేస్తుంది.

  • By Hashtag U Published Date - 11:11 AM, Wed - 30 March 22
  • daily-hunt

వడ్ల కొనుగోలు అంశం.. బీజేపీతో పాటు టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ మొదటివారంలోపు కోతలు పూర్తయితే ఆ పంటంతా మార్కెట్ కు వచ్చేస్తుంది. అప్పటికి కాని కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చేయకపోతే రైతుల నుంచి నిరసన తప్పదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. అందుకే మరో కొత్త ఆలోచన చేసింది. మరి అది వర్కవుట్ అవుతుందా?

ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి వస్తే ఏం చేయాలి అన్నదానిపై యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, కొనుగోలుకు కావలసిన ఏర్పాట్లు.. అన్నింటి గురించి ఆలోచిస్తోంది. ఇప్పటికే కేంద్రం నుంచి నిరాశ తప్పలేదు. మళ్లీ అడిగితే ఫలితముంటుందో లేదో తెలియదు. ఉగాది తరువాత వరికోతలు పెరుగుతాయి. ఆలోపే నిర్ణయం తీసుకోవాలి.

తెలంగాణలో యాసంగిలో చేతికొచ్చిన పంటకు ఎండవేడి తప్పదు. దీనివల్ల ధాన్యంలో తేమ శాతం తగ్గిపోతుంది. అందుకే మిల్లింగ్ సమయంలో నూకల శాతం పెరుగుతుంది. దీంతో యాసంగి ధాన్యాన్ని మిల్లర్లు ఉప్పుడు బియ్యంగా మార్చేస్తారు. కానీ ఉప్పుడు బియ్యాన్ని కొనబోమని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. అందుకే రైతులకు ఏ సమస్యా రాకుండా చూడడానికి మిల్లర్లతో కొనిపించాలా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఇప్పటికే ఎమ్మెల్యేల స్థాయిలో మిల్లర్లతో చర్చలు జరుగుతున్నాయి. కానీ మిల్లర్లు వ్యాపారస్తులు. అందుకే మద్దతు ధరను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు. లెవీ విధానం ఎత్తేశాక.. ప్రభుత్వం ఇచ్చే ధాన్యంతోనే తప్ప సొంత పెట్టుబడితో వ్యాపారం చేయడం లేదు. పైగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు ఏ గ్రేడ్ ధాన్యం అయితే రూ.1980, మామూలు రకం అయితే రూ.1960 ఉంది. కానీ తెలంగాణలో కొన్ని చోట్ల క్వింటాకు కేవలం రూ. 1500 మాత్రమే ఇస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఈ సీజన్ లో సాగైన 60 లక్షల ఎకరాలకు గాను 70 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. ఈ మొత్తాన్ని కొని అమ్మాలంటే.. ఈ-వేలం పద్దతి ఎంతవరకు అక్కరకు వస్తుందా అని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. ఛత్తీస్ గఢ్ సర్కారు ఇప్పటికే ఇలాంటి విధానాన్ని అనుసరిస్తోంది. మధ్యప్రదేశ్ రూటు కూడా ఇదే. అందుకే బియ్యంగా మార్చి అమ్మితే వచ్చే భారం కన్నా.. ఈ-వేలం ద్వారా ధాన్యంగా అమ్మడమే మేలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరి ఇప్పుడు ఏ రూటును ఎంచుకుంటుందో చూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • paddy issue
  • paddy procurement
  • telangana

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!

Latest News

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd