HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Government Estimated The Flood Damage Report To The Center

Flood Damage : వరద నష్టాన్ని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం..కేంద్రానికి రిపోర్టు

ఖమ్మంలో,ఉమ్మడి వరంగల్ ,నల్గొండ లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసింది..

  • Author : Latha Suma Date : 04-09-2024 - 2:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana government estimated flood damage..report to centre
Telangana government estimated flood damage..report to centre

Telangana Govt : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన పంట, ఆస్తి నష్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక అంచనా రిపోర్ట్ ని సిద్ధం చేసింది.. ఈ మేరకు రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. ఖమ్మంలో,ఉమ్మడి వరంగల్ ,నల్గొండ లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసింది.. అదేవిధంగా జిల్లాల కలెక్టర్ల కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ని అందుబాటులో ఉంచి ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్ర వ్యాప్తంగా 110 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 4000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా ఈ శిబిరాలకు తరలించారు. శిబిరాల్లో ఉన్నవారికి భోజనంతోపాటు అన్ని వసతులు ప్రభుత్వం కల్పించింది.. రాష్ట్రంలో వర్షాల కారణంగా కలిగిన నష్టం 5వేల438 కోట్ల రూపాయలు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనావేసింది. ఆర్అండ్ బీ శాఖకు సంబంధించి 2వేల 362 కోట్ల రూపాయలు, ఇంధన శాఖ సంబంధించి 175 కోట్ల రూపాయలు పంట నష్టం ఏర్పడినట్టు అంచాన వేసింది.

Read Also: Paris Paralympics 2024: టోక్యో రికార్డు బద్దలు, పారాలింపిక్స్‌లో భారత్ 20 పతకాలు

నీటిపారుదల శాఖకు సంబంధించి 415 కోట్లు, పంచాయతీ గ్రామీణాభివృద్ధి సంబంధించి 629 కోట్ల రూపాయలు నష్టం ఏర్పడినట్టు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అలాగే, వైద్య ఆరోగ్యశాఖ కు సంబంధించి 170 కోట్ల రూపాయలు, పశు సంవర్ధక శాఖ కు 12 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట కు సంబధించి 25 కోట్లు, ఇతర విభాగాలకు 11 వేల 50 కోట్లు నష్టం ఏర్పడినట్టు అంచనా వేసింది. ప్రజా ఆస్తులు 500 కోట్ల రూపాయలు నష్టం ఏర్పడినట్టు ప్రభుత్వం రిపోర్ట్ లో పేర్కొంది.

ఇక వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత. జిల్లాల వారిగా జరిగిన నష్టం పై రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టుని సిద్ధం చేయనుంది.. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారుల బృందం పర్యటించి జరిగిన నష్టం పై నివేదిక తయారు చేస్తుంది. ఇవ్వనుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించనుంది అనేది ఆసక్తి గా మారింది..ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ లో పర్యటించాలని విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం.

Read Also: Paris Paralympics 2024: టోక్యో రికార్డు బద్దలు, పారాలింపిక్స్‌లో భారత్ 20 పతకాలు

ఇక రాష్ట్రంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాడి పశువులకు 30 వేల నుంచి 50 వేల రూపాయలు, మేకలు, గొర్రెలకు 3 వేల నుంచి 5 వేల రూపాయలు పెంచింది. తక్షణ సహాయ చర్యలకు ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లకు 5 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ..వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో 11 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాల కలెక్టర్స్ ని అలెర్ట్ చేసింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఎంత వర్షపాతం నమోదైనా ఎదుర్కొవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది ప్రభుత్వం.

Read Also: Relationship Tips : ఈ విషయాలు భార్యభర్తల మధ్య వివాదానికి కారణమవుతాయి…!

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central govt
  • flood damage
  • heavy rains
  • report
  • telangana govt

Related News

Workers To Get Rs. Crore In

కార్మికులకు రూ. కోటి బీమా – భట్టి ప్రకటన

"కార్మికుల సంక్షేమమే మా ప్రాధాన్యత" అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ప్రజా ప్రభుత్వం, సింగరేణిని కేవలం ఒక లాభదాయక సంస్థగా మాత్రమే కాకుండా, వేలాది కుటుంబాల జీవనాధారంగా చూస్తోంది. ప్రమాదవశాత్తు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఈ కోటి రూపాయల బీమా కొండంత అండగా

    Latest News

    • ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!

    • టీ-20ల్లో ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త చరిత్ర..!

    • అల‌ర్ట్‌.. చెవి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలివే!

    • టీవీఎస్ ఎన్-టార్క్ 150.. హైపర్ స్పోర్ట్ స్కూటర్ యుగం ప్రారంభం!

    • కివీస్‌తో వన్డే సిరీస్.. ఆలస్యంగా జట్టుతో చేరనున్న రిషబ్ పంత్!

    Trending News

      • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

      • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

      • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

      • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

      • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd