HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Electricity Subsidy Mallu Bhatti Review

Bhatti Vikramarka : భవిష్యత్ తరాలను మరించి ఎనర్జీ పాలసీని తుంగలో తొక్కారు

Bhatti Vikramarka : తెలంగాణలో విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

  • Author : Kavya Krishna Date : 18-06-2025 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhatti Vikramarka (1)
Bhatti Vikramarka (1)

Bhatti Vikramarka : తెలంగాణలో విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం (జూన్ 18) ఖమ్మంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగానికి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వివరాలను వెల్లడించారు.

డిప్యూటీ సీఎం పేర్కొన్న ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉపయోగిస్తున్న 29 లక్షల పంపు సెట్లకు ప్రతి సంవత్సరం రూ. 11,500 కోట్లు చెల్లిస్తోంది ప్రభుత్వం. అలాగే ప్రజలకు ఉచితంగా అందిస్తున్న 200 యూనిట్ల విద్యుత్ పథకం కింద 5 లక్షల 70 వేల 132 కుటుంబాలకు రూ. 2,293 కోట్లు చెల్లించామని వెల్లడించారు. అంతేకాక, రాష్ట్రంలోని 29,018 విద్యా సంస్థలకు రూ. 198 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. మొత్తం మీద ప్రభుత్వం 13,992 కోట్ల రూపాయలు విద్యుత్ సబ్సిడీ కింద ఖర్చు చేసినట్లు తెలిపారు.

విపక్షాలు కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అవుతుందంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన భట్టి విక్రమార్క, “కాంగ్రెస్ అంటేనే కరెంట్… కరెంట్ అంటేనే కాంగ్రెస్,” అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క కొత్త విద్యుత్ ఉత్పత్తి సంస్థను కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయగలిగిందని చెప్పారు. “రాష్ట్రంలో ఎక్కడా నిమిషం కూడా కరెంట్ కట్ అవకుండా నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం,” అని భట్టి స్పష్టం చేశారు. 2030 నాటికి 33,773 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, దానికి అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం రూ. 1.80 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నామని వెల్లడించారు.

విద్యుత్ ఉద్యోగుల భద్రత కోసం త్వరలో విద్యుత్ అంబులెన్స్‌లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ వాహనాల్లో అవసరమైన రక్షణ సామగ్రి అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల బీమా సౌకర్యం కల్పించామని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఎదురైతే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

Kedarnath : కేదార్‌నాథ్‌లో హైవేపై విరిగిపడ్డ కొండచరియలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs vs congress
  • Congress Government
  • Electricity Subsidy
  • Energy department
  • Free Power Scheme
  • Mallu Bhatti Vikramarka
  • power supply
  • telangana
  • telangana farmers
  • telangana politics

Related News

CM Revanth Reddy

Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను తెలుగు ఆత్మగౌరవం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రతీకగా అభివర్ణించారు. వారి అభిప్రాయం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం కోసం పోరాట ప‌టిమ‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ విధానాలు, డా. బీఆర్ అంబేద్క‌ర్ ప్రతిపాదించిన స

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Ministers

    Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd