Rebels: ఎన్నికల పోరులో రెబల్స్ ఝలక్.. ప్రధాన పార్టీలకు ఓటమి స్ట్రోక్!
చాలా చోట్లా రేసులో ఉన్న నేతలకు చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో ఆయా అభ్యర్థులు తగ్గేదేలే అంటూ నామినేషన్ వేశారు.
- By Balu J Published Date - 03:58 PM, Sat - 11 November 23
Rebels: 2023 అసెంబ్లీ ఎన్నికలో భాగంగా నిన్న తెలంగాణ వ్యాప్తంగా నామినేషన్స్ గడవు ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలా చోట్లా రేసులో ఉన్న నేతలకు చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో ఆయా అభ్యర్థులు తగ్గేదేలే అంటూ నామినేషన్ వేశారు. రెబెల్స్ గా ప్రచారం ముమ్మరం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కొత్త టెన్షన్ మొదలైంది. రెండు జాతీయ పార్టీల రెబల్స్ తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేయడం ద్వారా బరిలోకి దిగారు. దీంతో ఓట్ల వాటాను చీల్చడం, అనేక సెగ్మెంట్లలో గెలపు ఓటములను ప్రభావితం చేయడం జరుగుతుంది.
రామగుండం, సూర్యాపేట, నల్గొండ, పటాన్చెరు, వరంగల్ వెస్ట్, మంథని, ఆదిలాబాద్, వేములవాడ తదితర నియోజక వర్గాల్లో ముఖ్య నాయకులకు టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా బరిలో దిగారు. రామగుండంలో బీజేపీ తరఫున కందుల సంధ్యారాణిపై బీఆర్ఎస్ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో అధికార బీఆర్ ఎస్ అభ్యర్థి ఆశలకు ముప్పు వాటిల్లుతోంది.
సూర్యాపేటలో కాంగ్రెస్ అభ్యర్థి పటేల్ రమేష్రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో ఆఖరి నిమిషం వరకు ఆయనే గట్టి పోటీదారుగా భావించి పార్టీలో టెన్షన్ను పెంచారు. పటాన్చెరులో తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ప్రకటించి ఆ తర్వాత స్థానంలో కాటా శ్రీనివాస్ గౌడ్ బీఎస్పీలో చేరి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేయడంతో కాంగ్రెస్, బీఆర్ ఎస్ లకు తలనొప్పిగా మారింది.
నల్గొండలో తుంగతుర్తి టికెట్ ఆశించిన విఫలమవడంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య ఆ పార్టీ అధికారిక అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వరంగల్ వెస్ట్లో కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ దాఖలు చేయడంతో ఆ పార్టీ అధికారిక అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డికి సవాళ్లు మరింత పెరిగాయి.
మంథనిలో బీఆర్ఎస్ మాజీ నేత, ప్రస్తుత బీఎస్పీ నేత చల్లా నారాయణ పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీలో ఏ సంజీవ రెడ్డి ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తుల ఉమ పార్టీ బీ-ఫారం నిరాకరించడంతో ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేసి ముమ్మరంగా ప్రచారం ఇతర పార్టీల అభ్యర్థులకు ఛాలెంజ్ విసురుతున్నారు.
Also Read: MLC Kavitha: రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
Related News
Lok Sabha Elections 2024: 10-11 సీట్లు గెలిస్తే కేసీఆరే మళ్లీ తెలంగాణ సీఎం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్10-11 లోక్సభ స్థానాలు గెలిస్తే తెలంగాణలో మళ్లీ ఏడాదిలోపే బీఆర్ఎస్ అధినేత కేసీఆరే సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.