BRS Survey: కేసీఆర్ కి సవాల్ గా మారిన అంతర్గత పోరు
కేసీఆర్ ప్రభుత్వ పనితీరుతో మొత్తం 60 శాతం సంతృప్తిగా ఉన్నట్టు తాజా సర్వే వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు అంతర్గత వర్గపోరు సవాల్గా మారే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.
- By Praveen Aluthuru Published Date - 05:59 PM, Tue - 5 September 23
BRS Survey: తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలైంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎన్నికల బరిలో దిగనుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీచేయనుండగా, కేంద్ర మంద్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కమలం పార్టీ రానున్న ఎలక్షన్స్ లో తమ భవితవ్యం తేల్చుకోనున్నాయి.
తెలంగాణాలో కేసీఆర్ పనితీరుతో మొత్తం 60 శాతం సంతృప్తిగా ఉన్నట్టు తాజా సర్వే వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు అంతర్గత వర్గపోరు సవాల్గా మారే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. అభ్యర్థిత్వంలో మార్పు రావడమే దీనికి ప్రధాన కారణం. ఉదాహరణకు ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల అనుచరులు, ద్వితీయశ్రేణి నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విభేదాలు నేతల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా ఎన్నికల్లో బీఆర్ఎస్కు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది.
కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కూడా పార్టీ నేతల మధ్య ఇలాంటి విభేదాలే కనిపిస్తున్నాయి. ఇటీవల మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ మంత్రి హరీశ్రావును హెచ్చరించడంతో పార్టీ టిక్కెట్ల విషయంలో అంతర్గత కుమ్ములాటలు వెలుగులోకి వచ్చాయి. అంతర్గత పోరుతో పాటు నల్గొండలో కాంగ్రెస్కు పెరుగుతున్న ప్రాబల్యం బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. జిల్లాలోని ఆరు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టిపోటీని ఎదుర్కోబోతున్నారని సర్వే వెల్లడించింది.
బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతాల నుంచి సైతం ఎదురుదెబ్బ తగిలే అవకాశముందని సర్వే పేర్కొంది. రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి గట్టిపోటీ ఎదురుకావచ్చు. హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్కు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
Also Read: Video Viral: పెళ్లిలో బ్లాక్ డ్రెస్సులతో అలాంటి పని చేసిన యువతులు.. వీడియో వైరల్?
Related News
Rythu Bandhu: నేను రోడ్డెక్కినందుకే రైతు బంధు ఇచ్చిండ్రు: కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం తన 'పోరు బాట' బస్సు యాత్రకు భయపడి రైతులకు 'రైతు బంధు' ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించిందని చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.