Road Accident : కోదాడ సమీపంలో లారీని ఢీకొట్టిన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు
- Author : Prasad
Date : 24-05-2026 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రవేట్ ట్రావెల్స్ బస్సులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలకు గురైన బస్సులు తాజాగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, కోదాడ్ పట్టణం సమీపంలో జాతీయ రహదారి 65పై ప్రవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి లారీని వేగంగా ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సు యోలో ట్రావెల్స్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు తెలిపిర వివరాల ప్రకారం డ్రైవర్ బస్సు నడుపుతూ నిద్రపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు . ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, హైవేపై సహాయక చర్యలు, ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు