Phone Tapping Case: హైకోర్టును ఆశ్రయించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ కుమార్
ఎస్ఐబి అధికారులకు, శ్రవణ్ కుమార్ కు ఎలాంటి సంబంధాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు కావాలనే తప్పుడు కేసులో ఇరికించారని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
- Author : Gopichand
Date : 29-10-2024 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం (Phone Tapping Case) ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రవణ్ కుమార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్ ఏ6గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రవణ్ కుమార్పై లుక్ ఔట్ సర్కులర్ తో పాటు పాస్ పోర్ట్ ను రద్దు చేశారు పోలీసులు.
ఎస్ఐబి అధికారులకు, శ్రవణ్ కుమార్ కు ఎలాంటి సంబంధాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు కావాలనే తప్పుడు కేసులో ఇరికించారని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది కోర్టులో తెలిపారు. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
Also Read: Kerala Fire: కేరళలో భారీ అగ్నిప్రమాదం.. 150 మందికి పైగా గాయాలు!
పోలీసు ఉన్నతాధికారులతో సహా ఆరుగురు వ్యక్తులతో కూడిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-6గా ఉన్న ఆరువెల శ్రవణ్ కుమార్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ప్రతిస్పందనగా జూబ్లీహిల్స్ అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు సోమవారం రాష్ట్రాన్ని కోరింది. నిందితుల్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డి ప్రభాకర్ రావు (ఏ1), దుగ్యాల ప్రణీత్ రావు, డీఎస్పీ (ఏ2), నాయిని భుజంగరావు, అదనపు ఎస్పీ (ఏ3), మేకల తిరుపతన్న (ఏ4), పి రాధాకిషన్ రావు, డీసీపీ (రిటైర్డ్) (ఏ5), ఆరువేల శ్రవణ్ కుమార్ రావు (A6)గా ఉన్నారు. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ఆదేశాలు పొంది తదుపరి విచారణ కోసం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని శ్రవణ్కుమార్రావు దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం జస్టిస్ జువ్వాడి శ్రీదేవితో కూడిన హైకోర్టు సింగిల్ బెంచ్ నవంబర్ 7కి వాయిదా వేసింది.