Telangana
-
Komatireddy Raj Gopal Reddy : కాంగ్రెస్ కు రాజగోపాల్ రాజీనామా చేయబోతున్నారా..?
Komatireddy Raj Gopal Reddy : మంత్రి వెంకటరెడ్డి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతూ పూజలు చేయగా, మరోవైపు రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు
Date : 05-08-2025 - 7:07 IST -
Minister Tummala: కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల.. రైతుల మేలు కోసమేనా?
ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాని తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.
Date : 05-08-2025 - 4:51 IST -
Minister: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: మంత్రి
విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేసి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Date : 05-08-2025 - 4:28 IST -
Harish Rao : కేసీఆర్ను హింసించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన : హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని వక్రీకరితమైన ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అతని ప్రతిష్టను దెబ్బతీయడమే వారి అసలైన ఆలోచన అని అన్నారు.
Date : 05-08-2025 - 1:22 IST -
KTR : ఉచిత తాగునీటి పథకాన్ని తొలగించాలన్న కుట్ర.. మూర్ఖత్వం పరాకాష్ఠలో సీఎం రేవంత్: కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకం ద్వారా హైదరాబాద్లోని కోటి 20 లక్షల ప్రజలకు మంచి నీరు నిరంతరంగా అందుతుంది. అలాంటి పథకాన్ని తవ్వేయాలన్న తపనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు.
Date : 05-08-2025 - 12:45 IST -
Congress : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ సంఘాల సమన్వయంతో మూడు రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద పెద్ద స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు కేంద్రాన్ని ఒప్పించే లక్ష్యంతో పెద్ద ఎత్తున ప్రజా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయనుంది కాంగ్రెస్.
Date : 05-08-2025 - 11:40 IST -
Margadarsi : మార్గదర్శికి హైకోర్టులో ఊరట.. క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు
Margadarsi : మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థపై చాలాకాలంగా కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్కు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది.
Date : 05-08-2025 - 10:53 IST -
Indiramma Housing Scheme : నిన్న ఒక్క రోజే రూ. 130 కోట్లను బదిలీ చేసిన సర్కార్
Indiramma Housing Scheme : ఈ పథకానికి సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియ జోరుగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా రూ. 130 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు
Date : 05-08-2025 - 8:00 IST -
CM Revanth Reddy : కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీఎం వ్యాఖ్యలు
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అజాగ్రత్తలతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను నిర్మించిందని ఆరోపించారు.
Date : 04-08-2025 - 9:58 IST -
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోస్ కమిషన్ నివేదిక.. కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు!
జనవరి 21, 2015న నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని నివేదికలో ఉంది. ఆ కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని "నిషేధాత్మక ఖర్చు, సమయ వినియోగం" కారణంగా తిరస్కరించింది.
Date : 04-08-2025 - 9:39 IST -
Warangal MP Kadiyam Kavya: తెలంగాణకు ఐఐఎం.. కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న వరంగల్ ఎంపీ!
MP కావ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక వసతులు సిద్ధం చేసిందని తెలిపారు.
Date : 04-08-2025 - 7:55 IST -
Uttam Kumar Reddy : కాళేశ్వరం అప్పుల పర్యవసానం.. మేడిగడ్డలో చట్ట విరుద్ధ నిర్మాణం: మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
భారీ అప్పులతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పాలనలోనే కూలిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్పై న్యాయ విచారణ జరిపిస్తామని అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టాం. రాజకీయ హంగులు జోడించకుండా న్యాయపరంగా సమగ్రంగా విచారించాల్సిందిగా కమిషన్కు సూచించాం.
Date : 04-08-2025 - 7:24 IST -
BRS : బీఆర్ఎస్కు షాక్.. గువ్వల బాలరాజు రాజీనామా
BRS : బీజేపీ వైపు అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు తన పార్టీకి గుడ్బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు అధికారిక లేఖను పంపించారు.
Date : 04-08-2025 - 7:12 IST -
Heavy rain : హైదరాబాద్లో కుండపోత వర్షం.. నగరమంతా జలమయం, ట్రాఫిక్కు బ్రేక్
ఈ భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయింది. రాజ్భవన్ ఎదుట భారీగా వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన డ్రైనేజీలను వర్షపు నీరు ముంచేయడంతో మళ్లీ మున్సిపల్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
Date : 04-08-2025 - 6:25 IST -
BJP : బీసీలకు 42% రిజర్వేషన్లకు బీజేపీ పూర్తి మద్దతు: రామచందర్ రావు
ప్రజలకు మద్దతుగా పోరాడినట్లు చూపించేందుకు, హైదరాబాద్లో చేసినట్టు ఇప్పుడు ఢిల్లీలోనూ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీసీల రిజర్వేషన్ల పట్ల ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. రాష్ట్రం బీసీలకు అన్యాయం చేస్తోంది.
Date : 04-08-2025 - 4:43 IST -
Upasana : ఈ నియామకం నాకెంతో గౌరవాన్నిచ్చింది.. సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన కృతజ్ఞతలు
ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్గా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బాధ్యత నాకు గర్వకారణంగా ఉంది. రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండే అవకాశం లభించడం నా జీవితంలో ఒక మైలురాయి అని ఉపాసన పేర్కొన్నారు.
Date : 04-08-2025 - 1:50 IST -
Kaleshwaram : కాళేశ్వరం అవకతవకలకు పూర్తిబాధ్యత కేసీఆర్దే..పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు!
కమిషన్ వివరించిన ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవకతవకలకు ప్రధాన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుది (కేసీఆర్) అని స్పష్టంగా పేర్కొంది. కేసీఆర్ ఆదేశాల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో భారీ సమస్యలు తలెత్తినట్లు కమిషన్ నివేదికలో వెల్లడైంది.
Date : 04-08-2025 - 12:56 IST -
BC Reservations : కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇందుకు కృషి చేయాలి: ఎమ్మెల్సీ కవిత
దీక్షకు ముందు కవిత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి, వారి ఆశయాలకు ఆమె అంకితం చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, బీసీ సంఘాలు హాజరై కవితకు మద్దతుగా నిలిచారు.
Date : 04-08-2025 - 11:53 IST -
Congress : బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ‘చలో ఢిల్లీ’ ..కాంగ్రెస్ ఉద్యమం ఉధృతం
ఈ ఉద్యమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హజరై, జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ "చలో ఢిల్లీ" యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాల నుంచి కనీసం 25 మంది చొప్పున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Date : 04-08-2025 - 11:23 IST -
Cabinet Meeting : ‘కాళేశ్వరం’ నివేదిక పై చర్చించేందుకు నేడు కేబినెట్ భేటీ !
ఇప్పటికే ఈ నివేదిక సారాంశాన్ని సిద్ధం చేయడం కోసం ప్రత్యేకంగా నియమించబడిన ముగ్గురు సభ్యుల సీనియర్ అధికారుల కమిటీ ఆదివారం సాయంత్రం నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కూడా హాజరై, సారాంశ నివేదిక తుది రూపును ఆమోదించారు.
Date : 04-08-2025 - 11:09 IST