HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Governments Rule Aims To Torture Kcr Harish Rao

Harish Rao : కేసీఆర్‌ను హింసించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన : హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని వక్రీకరితమైన ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అతని ప్రతిష్టను దెబ్బతీయడమే వారి అసలైన ఆలోచన అని అన్నారు.

  • Author : Latha Suma Date : 05-08-2025 - 1:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్టు గురించి జరుగుతున్న విమర్శలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పందిస్తూ, తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ప్రజెంటేషన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని వక్రీకరితమైన ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అతని ప్రతిష్టను దెబ్బతీయడమే వారి అసలైన ఆలోచన అని అన్నారు.

చారిత్రక ఒప్పందం – మహారాష్ట్రతో సహకారం

మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాం. ఇది కేవలం తెలంగాణకే కాకుండా, దేశానికే మేటి ప్రాజెక్టుగా నిలిచింది అని హరీశ్ రావు స్పష్టం చేశారు. అదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్ల పాలనలో ఒక్క కొత్త ప్రాజెక్టు అయినా ప్రారంభించిందా అని ప్రశ్నించారు.

కమిషన్ నివేదికపై తీవ్ర విమర్శలు

కాళేశ్వరం కమిషన్ నివేదికపై స్పందిస్తూ..నివేదిక పూర్తిగా రాజకీయ ప్రేరణతో తయారుచేసినదిగా కనిపిస్తోంది. వాస్తవాలు బయటపెట్టాలన్నదే మా ఉద్దేశ్యం. నివేదిక పూర్తి వివరాలను అసెంబ్లీలో చర్చకు పెట్టాలి. ఎంపిక చేసిన పేర్లను లీక్ చేసి, ఇష్టమొచ్చిన వాళ్లను బాధ్యులుగా నిర్ణయించడం ప్రజాస్వామ్య పరంగా సరికాదు అని హరీశ్ పేర్కొన్నారు. కమీషన్ నివేదిక ఆధారాల్లేని ఆరోపణల సమాహారం. ఒకవైపు కేంద్రం అనుమతులతో నిర్మించిన ప్రాజెక్టు అని చెబుతారు, మరోవైపు కేంద్రమే తప్పు చేశదనేది నైతికంగా సరిపోదు. ఇది పూర్తిగా ఏకపక్షంగా తయారుచేసిన నివేదిక” అని విమర్శించారు. “ఇది ట్రాష్‌ లాంటిదే” అని ఘాటు వ్యాఖ్య చేశారు.

కాంగ్రెస్‌, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్‌, బీజేపీ కలిసి కమిషన్ల రాజకీయాలను నడిపిస్తున్నాయి. డబ్బుల కోసం, ప్రతిపక్షాలపై కక్ష సాధించేందుకు మాత్రమే కమిషన్లు పెట్టారు. రాష్ట్రాన్ని కమిషన్ల మయం చేశారు అన్నారు. తుమ్మిడిహట్టిపై కూడా హరీశ్‌రావు స్పందించారు. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఒప్పందం జరిగిందని రుజువు చేస్తే సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారు అని అప్పట్లో సవాల్ చేశారు. కానీ కాంగ్రెస్ దాన్ని ప్రస్తావించడంలేదు అన్నారు. అలాగే, బనకచర్లకు నీరు పోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనపై ఒకవైపు కాళేశ్వరం కూలిపోయిందంటారు.. మరోవైపు మూసీకి గోదావరి జలాలు తీసుకురావాలని ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు.

భవిష్యత్‌ తరాలకు కేసీఆర్ ఆరాధ్యుడు

ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కాటన్‌పై బ్రిటిష్ ప్రభుత్వం కమిషన్ వేసిన ఉదాహరణను చేస్తూ కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్‌ను భవిష్యత్ తరాలు దేవుడిలా కొలుస్తాయి అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి సాధించలేదని హరీశ్ విమర్శించారు. ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా? దిల్లీకి కమిషన్లు తీసుకెళ్లడమే తప్ప ఇతర అభివృద్ధి పనులు ఏమీ చేయలేదు. వచ్చే మూడేళ్లలో కూడా ఇదే తీరులో ఉంటుందనే భావన ప్రజల్లో ఉంది అని వ్యాఖ్యానించారు. కాగా, కాళేశ్వరం అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా ఉపయోగించుకుంటోందని హరీశ్ రావు ఆరోపించారు. పూర్తి నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేస్తూ, వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ పంథాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు ముందుకు సాగుతుంది. హరీశ్ రావు వ్యాఖ్యలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుంది అన్నది కీలకాంశంగా మారింది.

Read Also: NDA Meet : ఇటువంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదు: ప్రధాని మోడీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Govt
  • harish rao
  • Kaleshwaram commission report
  • kaleshwaram project
  • kcr

Related News

Quit India Movement..The foundation of the Congress movement: TPCC President Mahesh Kumar Goud's comments

BRS : బిఆర్ఎస్ ను నడిపించే చరిష్మా కేసీఆర్ కు మాత్రమే ఉంది – TPCC చీఫ్ మహేష్

BRS : భారత్ రాష్ట్ర సమితి (BRS) భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న చరిష్మా, ఆయన కుటుంబంలో మరెవ్వరికీ లేదని మహేశ్ అన్నారు

  • Revanth Reddy Became A Pois

    Gurukul Hostel Food : గురుకుల పాఠశాల విద్యార్థులుకు విషంగా మారిన రేవంత్ – హరీశ్ రావు

Latest News

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

  • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

Trending News

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd