Kavitha Injured: కవిత కాలికి గాయం.. మూడు వారాలు రెస్ట్!
మంగళవారం తన కాలుకు గాయమైనట్టు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
- By Balu J Published Date - 12:25 PM, Tue - 11 April 23
Kavitha Injured: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కాలు గాయంతో బాధపడుతోంది. మంగళవారం తన కాలుకు గాయమైనట్టు ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ‘‘నా కాలికి గాయం (Avulsion Fracture) అవ్వడంతో మూడు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది’’ అని కవిత రియాక్ట్ అయ్యారు. కాలి గాయం కారణంగా కవిత కొన్ని వారాల పాటు రాజకీయ సభలు, సమావేశాలకు దూరంగా కానుంది. కార్యకర్తలు, నాయకుల కోసం జూమ్ లేదా వీడియో కాల్స్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది.
గతంతో కేటీఆర్
గతంలో కవిత సోదరుడు, మంత్రి కేటీఆర్ కాలుకి గాయమైన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆయన 3 వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఫైల్స్ ను ఇంటికే తెప్పించుకొని విధులు నిర్వహించారు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా వర్క్ ఫ్రం హోం చేశారు. ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ లు, టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహించారు. అయితే కేటీఆర్ ఓటీటీ లో చూసేందుకు మంచి సినిమాలు కావాలని చెప్పడం విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.
Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks.
My @OfficeOfKavitha shall be available for any assistance or communication.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023
Also Read: 40 Dogs Killed: జగిత్యాల జిల్లాలో దారుణం.. 40 కుక్కలు హతం!
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.