HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Jupally Krishna Rao Fire On Brs Party

Minister Jupally Krishna Rao: కాంగ్రెస్ పాల‌న దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ ర‌క్ష: మంత్రి జూప‌ల్లి

70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, బీఆర్ఎస్‌ పదేళ్ల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదని మంత్రి విమ‌ర్శించారు.

  • Author : Gopichand Date : 01-12-2024 - 2:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Excise Minister
Excise Minister

Minister Jupally Krishna Rao: శ‌నివారం మహబూబ్ నగర్‌లో భారీ ఎత్తున రైతు పండగ సభ విజయవంత‌మైంద‌ని, పాలమూరు ప్రజల తరుపున సీఎంకు ధన్యవాదాలు అని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) పేర్కొన్నారు. మూడు రోజుల పాటు రైతు పండగ సభలో వేలాదిగా రైతులు పాల్గొని వ్యవసాయ ఆధారిత అదునాతన సాంకేతిక పరికరాలను పరిశీలించారని మంత్రి తెలిపారు. నా రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద వ్యవసాయానికి సంబంధించిన స్టాల్స్.. టెక్నాలజీ మీద రైతులకు అవగాహన కల్పించి కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు. సాంకేతిక సమస్యతో పెండింగ్‌లో ఉన్న రుణమాఫీని రూ. 2,750 కోట్లు విడుదల చేయడం జరిగిందని వివ‌రించారు.

70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, బీఆర్ఎస్‌ పదేళ్ల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదని మంత్రి విమ‌ర్శించారు. సీఎం పెద్ద మనసుతో పాలమూరు వలసల జిల్లా కు క్యాబినెట్ మంత్రుల సమక్షంలో ఏడాదికి రూ. 20 వేల కోట్లు ఇవ్వమని రేవంత్ రెడ్డి కోరారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని గుర్తుచేశారు. అప్పులు చేసి పోవడమే కాక.. రూ. 40వేల కోట్ల బకాయిలు పెట్టార‌ని మంత్రి తెలిపారు. ఏడాదికి రూ. 800 కోట్ల ఆదాయం వచ్చే అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును అప్పనంగా అమ్ముకున్నారని మండిప‌డ్డారు. రింగురోడ్డు 35ఏళ్లకు 7వేల కోట్లకు అమ్మారని తెలిపారు.

Also Read: Tritiya Jewellers : హీరోయిన్స్‌కే కుచ్చుటోపీ పెట్టిన మోసగాడు.. కటాకటాల వెనక్కి కాంతిదత్

బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో రైతు రుణమాఫీ కేవలం 25 శాతం మందికి మాత్ర‌మే చేశారని మంత్రి తెలిపారు. రేషన్ షాపులో 6 రూపాయలకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు దళారులు 16 రూపాయలకు కేజీ అమ్ముకున్నారని ఫైర్ అయ్యారు. అప్పు చేసింది నిజం కాదా వడ్డీ కట్టేది నిజం కాదా .. ఎవడు వస్తాడో ఎల్బీ స్టేడియంలో చర్చకు రండి.. కేటీఆర్, హరీష్ రావు వస్తారా అని స‌వాల్ విసిరారు. ఎంత గొప్పగా పద్యాలు, స్పీచ్‌లు ఇచ్చామ‌నేది కాదు.. పారదర్శకమైన పాలన చేయడం గొప్పతనం అని అన్నారు.

గొప్ప ఉద్యమకారుడిని అని చెప్పుకొనే నిరంజన్ రెడ్డి 2001-2018 వరకు ఒక్కసారి కూడా ఎందుకు గెలువలేదు. కేసీఆర్ రైట్ హ్యాండ్ నిరంజన్ రెడ్డి దొంగ ఉద్యమం చేశాడు. ప్రజలు సమయం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టారని అన్నారు. అవగాహన రహిత్యంగా ఛార్జ్ షీట్ విడుదల చేయవద్దని, ఒక్క సంవత్సరంలో ఏం తెలుస్తుంది. మాకు ఇంకా సమయం ఉంది.. ఐదు ఏళ్ల పరిపాలన చూసి ఛార్జ్ షీట్ విడుదల చేస్తే బాగుంటుందని మంత్రి తెలిపారు. పూర్వ పరాలు పరిశీలించి ఛార్జ్ షీట్ రిలీజ్ చేయాలని, రైతు పండగ చూసి కేటీఆర్, హరీష్ రావులకు నిద్ర పట్టలేదని ఎద్దేవా చేశారు.

పదేళ్లలో గొప్ప పాలన చేస్తే పది లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయి? నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తుంది. గత పాలనలో మంత్రులకు ప్రగతి భవన్ లోకి ఆహ్వానం లేదు. సెక్రటేరియట్ లోకి ఎమ్మెల్యేలకు అనుమతి లేదు. ప్రతిపక్ష పార్టీల గాడిలో ప్రజలు పడకుండా ఉండాలి. కాంగ్రెస్ పాలన దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఆయ‌న అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • congress
  • Jupally Krishna Rao
  • kcr
  • Minister Jupally Krishna Rao
  • telangana
  • telangana politics
  • telugu news

Related News

Telangana Speaker G Prasad Kumar

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

Telangana Speaker Dismissed Disqualification Petition On Brs Mlas : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువరించారు. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి. కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట

  • New Sarpanches

    తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Lok Sabha

    లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

Latest News

  • ల‌క్నో జ‌ట్టుకు బిగ్ షాక్‌.. కీల‌క ఆట‌గాడు దూరం!

  • భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ‌ధ్య టీ20 ర‌ద్దు.. అభిమానులు ఆగ్ర‌హం!

  • సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

  • కుక్కల కోసం ప్రత్యేక ఆలయం.. ఎక్కడ ఉందంటే?

Trending News

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd