Kavitha MLC: ఆదివారం సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత
- By Vamsi Chowdary Korata Published Date - 01:15 PM, Sat - 10 December 22
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీనే ఆమెను సీబీఐ (CBI) అధికారులు విచారించాల్సి ఉంది. అయితే 6వ తేదీన తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయని ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని సీబీఐకి కవిత (Kavitha) లేఖ రాశారు.
సీబీఐ డీఐజీ మంగళవారం కవితకు మెయిల్ పంపించారు. మీరు పేర్కొన్న తేదీలను పరిగణనలోకి తీసుకున్నామని… ఈ నెల 11న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని మీ నివాసానికి సీబీఐ బృందం వస్తుందని… ఆ సమయంలో విచారణకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. దీనికి సమాధానంగా కవిత మెయిల్ ద్వారా స్పందించారు. 11వ తేదీ ఉదయం తన నివాసంలో తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో, కవితను రేపు సీబీఐ విచారించనుంది. సీబీఐ కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు పంపింది. అంటే ఈ స్కామ్ కు సంబంధించి ఆమెను తొలుత ఒక సాక్షిగా విచారిస్తారు. ఆ తర్వాత విచారణలో తేలే విషయాలను బట్టి ఆమెను కేసులో ముద్దాయిగా చేర్చవచ్చు.
Also Read: TSRTC: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్.. సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు
Related News
Movie Theaters: ఈనెల 17 నుంచి తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్..!
తెలంగాణ రాష్ట్రంలోని సినీ ప్రియులకు షాక్ తగలనుంది.