Kamareddy MLA: మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టత.. ఏమన్నారంటే..?
కామారెడ్డి (Kamareddy)లో రైతులు నెల రోజులుగా ధర్నా చేస్తుండటం, ఇటీవల ఒక రైతు ఆత్మహత్య చేసుకుని ఆందోళన మరింత ఉధృతం అవడం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలన్నీ ఇక్కడి రైతుల ఆందోళనకు మద్దతు పలుకుతుండటంతో అధికార పార్టీ మేల్కొని నష్టనివారణ చర్యలకు పూనుకుంది.
- By Gopichand Published Date - 12:25 PM, Sun - 8 January 23
కామారెడ్డి (Kamareddy)లో రైతులు నెల రోజులుగా ధర్నా చేస్తుండటం, ఇటీవల ఒక రైతు ఆత్మహత్య చేసుకుని ఆందోళన మరింత ఉధృతం అవడం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలన్నీ ఇక్కడి రైతుల ఆందోళనకు మద్దతు పలుకుతుండటంతో అధికార పార్టీ మేల్కొని నష్టనివారణ చర్యలకు పూనుకుంది. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్పై ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే (Kamareddy MLA), ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ (Gampa Goverdhan) స్పందించారు. కామారెడ్డిలో తమ వ్యవసాయ క్షేత్రాలను కలుపుకుని ప్రతిపాదిత పారిశ్రామిక జోన్పై రైతులు నిరసన వ్యక్తం చేయడంతో, ప్లాన్ను మళ్లీ రూపొందించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శనివారం కన్సల్టెంట్లు, టౌన్ ప్లానర్లను కోరారు. ప్రస్తుత ముసాయిదా ప్రణాళికను స్థానిక యంత్రాంగం ఆమోదించదని ఆయన అన్నారు.
కన్సల్టెంట్, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డిటిసిపి) అనుమతి లేకుండా అనేక మార్పులు చేయడం గందరగోళానికి దారితీసిందని గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ముసాయిదాకు కామారెడ్డి మున్సిపాలిటీ తీర్మానం చేసి పంపడం జరిగిందని వెల్లడించారు. అయితే ఆ సంస్థ కామారెడ్డి మున్సిపాలిటీ పంపిన తీర్మానానికి వ్యతిరేకంగా మ్యాప్ రూపొందించిందని అన్నారు. ఆ సంస్థ తయారు చేసిన మ్యాప్ వల్లే కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రైతాంగంను అయోమయానికి గురి చేసిందన్నారు.
Also Read: Sankranti Holidays: సంక్రాంతి సెలవుల్లో మార్పు.. ఈనెల 12 నుంచి 18 వరకు సెలవులు..!
అందరి అభిప్రాయాలను తీసుకుంటాం. ఇంకా 60 రోజులు పూర్తి కాలేదు. జనవరి 11 వరకు అభ్యంతరాలు తీసుకుంటాం. తనను, మున్సిపల్ కౌన్సిల్ను వివాదం నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేసిన గోవర్ధన్ తదుపరి కౌన్సిల్ సమావేశంలో సవరించిన ముసాయిదా ప్రణాళికను ఆమోదించబోమని చెప్పారు. రైతులు తమ భూమిని కోల్పోతారనే భయాన్ని కాంగ్రెస్, బీజేపీలు సృష్టిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపించారు. మాస్టర్ప్లాన్పై రైతులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తూ కొత్త మాస్టర్ప్లాన్ ఖరారులో రైతు సంఘంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయాన్ని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్తామని గోవర్ధన్ తెలిపారు.
Tags
Related News
Harish Vs Revanth : హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం – రేవంత్ రెడ్డి
మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తు వస్తుందంటూ రేవంత్ సెటైర్ వేశారు