HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Jp Nadda To Address Bjp Public Meeting In Warangal On Aug 26

Praja Sangrama Yathra : వరంగల్ లో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ.. హాజరుకానున్న జేపీనడ్డా!

తెలంగాణలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ముగింపు సందర్భంగా ఆగస్టు 26 న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలం పార్టీ యోచిస్తోంది.

  • Author : Anshu Date : 28-07-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jp Nadda
Jp Nadda

తెలంగాణలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ముగింపు సందర్భంగా ఆగస్టు 26 న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలం పార్టీ యోచిస్తోంది. ఈసభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్న నేపథ్యంలో సభకు రెండు లక్షల మందిని సమీకరించాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. సభ సక్సెస్ బాధ్యతలను సీనియర్‌ నేతలకు అప్పగించినట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

అటు మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభసభలో ప్రసగించేందుకు మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగస్టు 2న యాదాద్రిలో పర్యటించనున్నారు.ఈ సభకు లక్ష మందిని సమీకరించాలని కమలం పార్టీ యోచిస్తోంది. ఆగస్టు 2న యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో యాత్ర ప్రారంభమై ఆగస్టు 26న హన్మకొండ శ్రీభద్రకాళి ఆలయంలో ముగుస్తుంది. యాదాద్రి-భువనగిరి, నల్గొండ, జనగాం, హమన్‌కొండ, వరంగల్‌ అనే ఐదు జిల్లాల్లో 325 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. సంజయ్ ఐదు జిల్లాల్లోని మూడు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతారని, సమావేశాలు నిర్వహిస్తారని బీజేపీ నేతలు తెలిపారు.వివిధ ప్రాంతాల్లో జరిగే పాదయాత్రకు కేంద్ర మంత్రులు, బీజేపీకి చెందిన పలువురు నేతలు హాజరుకానున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • Bharatiya Janata Party
  • JP Nadda
  • praja sangrama yatra
  • trs
  • warangal

Related News

Bandivsetela

Etela Vs Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి జ్వాలలు

Etela Vs Bandi Sanjay : సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్, ప్రస్తుతానికి సంయమనం పాటిస్తున్నప్పటికీ, పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత 'బ్లాస్ట్' అయ్యే అవకాశం ఉందని

    Latest News

    • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

    • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd