HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Is Kcr Replicating Didi Tactics In Telangana

KCR Vs Mamata : మూడోసారి సీఎం కోసం మ‌మ‌త త‌ర‌హాలో కేసీఆర్

మూడోసారి ముఖ్య‌మంత్రి కావ‌డానికి ప‌శ్చిమబెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ కేంద్రం మీద అలుపెర‌గ‌ని పోరాటం చేసింది.

  • By CS Rao Published Date - 04:40 PM, Fri - 19 November 21
  • daily-hunt

మూడోసారి ముఖ్య‌మంత్రి కావ‌డానికి ప‌శ్చిమబెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ కేంద్రం మీద అలుపెర‌గ‌ని పోరాటం చేసింది. అదే త‌ర‌హాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆమె ఫార్మాలాను అందుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. బీజేపీ మీద 2023 నాటికి వ్య‌తిరేకత తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నాడు కేసీఆర్‌. ఆ క్ర‌మంలోనే వ‌రి ధాన్యం కొనుగోలు డిమాండ్ ను రాజ‌కీయంగా ర‌క్తిక‌ట్టించాడు. ఢిల్లీ వ‌ర‌కు పోరాటాన్ని తీసుకెళ్ల‌డానికి స‌న‌ద్ధం అయ్యాడు.
ప్రత్యేక రాష్ట్రం కోసం 10 ఏళ్ల పాటు జరిగిన భారీ ఆందోళనల నుంచి తాము పుట్టామని, కేంద్రాన్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునని కేసీఆర్ అంటున్నాడు. మమత పోరాటానికి, టీఆర్‌ఎస్‌ తీరుకు తేడా ఏంటంటే మమత కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దూకుడు ప్రకటనలకే కేసీఆర్ పరిమితం అయ్యాడు.

వరి సేకరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలియడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అంగీకరించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీపై విరుచుకుపడి యుద్ధం మొదలైందని అన్నాడు. ఆఖరు వరి గింజను కొనేంత వ‌ర‌కు గులాబీ పార్టీ వెంటాడి వెంటాడుతుందని హూంక‌రించాడు. ఆ రోజు నుంచి ఖరీఫ్ వరిధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రోడ్డెక్కింది.ప్రభుత్వం 6000కు పైగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని చెబుతున్నప్పటికీ కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్న మాట వాస్తవం. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం దిగుబడిలో ఇప్పటి వరకు 59 శాతం మాత్రమే కొనుగోలు చేశారు.

Also Read : టీఆర్ఎస్ నేతలపై బీజేపీ సోషల్ వింగ్ తప్పుడు ప్రచారం

వరి కొనుగోళ్ల ప్రక్రియ ఎందుకు నిదానంగా సాగుతుందో రాష్ట్ర ప్రభుత్వం వివరించడం లేదు. విధానం ఏమిటంటే, రాష్ట్రం రైతు నుండి సేకరించి, మిల్లర్లకు ఇచ్చి, ఆపై ఎఫ్‌సిఐకి బియ్యం సరఫరా చేయాలి. ఇది ఖర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం. నిల్వ సమస్యల కారణంగా వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు సరిపోవడం లేదని చెబుతున్నారు.ఇటీవల రుణం ఇచ్చేందుకు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చినా బ్యాంకులు అంగీకరించలేదని ఆరోపించారు. ఇది ఎంత వరకు నిజమో, దీనిపై ఎవరూ వ్యాఖ్యానించడానికి ఇష్టపడకపోవడంతో ప్రభుత్వానికే తెలుసు.ముఖ్యమంత్రి రాసిన లేఖ ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఎఫ్‌సీఐ 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నెమ్మదిగా కొనుగోళ్లకు ఇది ఒక కారణం కావచ్చు. కానీ ప్రజల వినియోగం కోసం, ప్రతి వరి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు పేర్కొన్నారు.

Also Read : బియ్యంలో కయ్యం…అసలు కథ!

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య వివాదం రైతు భవిష్యత్తుకు అంధకారంగా మారింది. ప్రభుత్వ ప్రాయోజిత ధర్నాలు ఈ సమస్యను పరిష్కరించగలవా? కాలమే సమాధానం చెబుతుంది.ఇలాంటి ధ‌ర్నాలు కేసీఆర్ ను మూడోసారి ముఖ్య‌మంత్రినిచేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని కొంద‌రు భావిస్తున్నారు. మ‌మ‌త కూడా ఇదే త‌ర‌హాలో మోడీ మీద పోరాటం చేసి మూడోసారి సీఎం అయ్యారు. ఇలా పోల్చుకుంటూ టీఆర్ఎస్ దీదీ వ్యూహాల‌ను అనుస‌రిస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • farmers protest
  • mamatha
  • telangana

Related News

BRS gains momentum in the wake of local body elections.. KTR is preparing for state tours

BRS : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ జోరు..రాష్ట్ర పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్

పార్టీ మళ్లీ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఇది కీలకంగా మారనుంది. అధికారంలో ఉన్నప్పటి గ్లోరీని మళ్లీ సాధించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెం మరియు భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు.

  • Ganesh Laddu

    Ganesh Laddu: వేలంలో గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ

  • 'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

    AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

Latest News

  • Tamil Nadu : తమిళనాడులో అమానుష ఘటన..భూవివాదంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి

  • Indian Railways : దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్స్ .. 122 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి

  • Russia : ఉక్రెయిన్ మంత్రులే లక్ష్యంగా రష్యా డ్రోన్, క్షిపణుల దాడి

  • Mumbai : చెత్త ఏరిన సీఎం భార్య, స్టార్ హీరో

  • Sponge Park : వరదలకి చెక్.. వినోదానికి సెంటర్ – చెన్నైలో స్పాంజ్ పార్క్

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd