HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Real Story Behind Paddy Politics

Paddy Politics : బియ్యంలో కయ్యం…అసలు కథ!

వ‌రి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య చాలా సాంకేతిక అంశాలు, లావాదేవీల వ్య‌వ‌హారం ఉంది. ఆ క‌థేంటో చ‌ద్దాం..

  • Author : CS Rao Date : 19-11-2021 - 12:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

వ‌రి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య చాలా సాంకేతిక అంశాలు, లావాదేవీల వ్య‌వ‌హారం ఉంది. ఆ క‌థేంటో చ‌ద్దాం..
ఉదాహరణకు తెలంగాణ లో ఈ యాసంగిలో 100 క్వింటాల్స్ వడ్లు పండాయ‌నుకుందాం. వాటిని మిల్లులో పడితే 65 క్వింటాల్స్ బియ్యం వస్తాయి. కానీ, యాసంగిలో నూక ఎక్కువ అవుతుంది అందువలన ఉడకబెట్టి బియ్యం తీస్తారు. ఇలా ఐతే 80 క్వింటాల్స్ బాయిల్డ్ బియ్యం వస్తాయి. అంటే అదనంగా 15 క్వింటాల్స్ బియ్యం వస్తున్నాయి. ఇక్కడే అసలు బియ్యం కథ‌లోని అస‌లు ట్విస్ట్.
కేంద్రం- రాష్ట్రం ఒప్పందం ప్రకారం ప్రతి క్వింటాల్ వడ్లకు 65 కిలోల బియ్యం రాష్ట్రం ఇవ్వాలి. ఎక్కువ తక్కువలతో సంబంధం లేదు. కాని బాయిల్డ్ ఎప్పుడూ కూడా తక్కువ రాదు. మరి ఇక్కడ 15 క్వింటాల్స్ బియ్యం ఎక్కువ వచ్చాయి. ఎక్కువ వచ్చాయని కేంద్రానికి చెప్పదు. ఉచితంగా కూడా ఇవ్వదు. ఆ 15 క్వింటాల్స్ బియ్యం కు కూడా సరిపడే వడ్లకు లెక్కను చూపిస్తుంది. అంటే 15 క్వింటాల్స్ బియ్యం రావడానికి 25 క్వింటాల్స్ ‌వడ్లు కొన్నట్లుగా చూపుతుంది. తెలంగాణ ప్ర‌భుత్వం మొత్తం కొన్న వడ్లు 125 క్వింటాల్స్ అని అవాస్తవ లెక్క చూపుతుంది. అద‌న‌పు 25 క్వింటాల్స్ అప్పనంగా వచ్చినట్లే కదా!

Also Read : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే

అప్పనంగా వచ్చినా కూడా… కేంద్రం నుండి ప్రతి క్వింటాల్ కి మద్దతు ధర 1960/- మిల్లు చార్జి 250/- రవాణా చార్జ్ 250/- హమాలీ&సుతిలీ 60/-ఇతరములు 40/- మొత్తం : ₹ 2560/- కేంద్రం ఇస్తుంది. వాస్తవానికి ఈ క‌థ‌లో తెలంగాణ రైతుల నుండి కొన్నది 100 క్వింటాల్స్ మాత్రమే. కాని కేంద్రానికి లెక్క చూపిస్తున్నది 125 క్వింటాల్. 25 క్వింటాల్స్ కి అప్పనంగా వస్తున్న ఆదాయం అక్షరాల ₹ 64000 /- ఇక అసలు తెలంగాణ పంటకు వద్దాం..
తెలంగాణ 2020 యాసంగి పంట 10000000 కోటి మెట్రిక్ టన్నులు. అంటే పది కోట్ల క్వింటాల్స్ 100000000 స్కాం ప్రకారం 125000000 తేడా 2500000 క్వింటాల్స్. కానీ, కేంద్రం నుండి రాష్ట్రం మాత్రం 125000000 x 2560 =320000000000 (ముప్పై రెండు వేల కోట్లు) వసూలు చేస్తుంది. వాస్తవానికి రైతులకు ఇచ్చేది100000000 x 1960 = 196000000000 (పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లు) మాత్రమే. ఇక్కడ తేడా మిగిలేది 124000000000 (పన్నెండు వేల నాలుగు వందల కోట్లు) వీటి అన్నింటిని కొంద‌రు రైస్ మిల్లర్లు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు పంచుకుంటారు. ఇలా ఏడు సంవత్సరాల నుండి దందా కొనసాగుతున్నది.
అందుకే బాయిల్డ్ రైస్ వద్దన్నందుకు ఇంత రాద్దాంతం. ఇలాంటి నిజాల‌ను బీజేపీ బ‌య‌ట‌పెడుతోంది. కానీ, కేంద్రంలో అధికారం వెల‌గ‌బెడుతూ చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి రాజ‌కీయ బంధాలు అడ్డుప‌డుతున్నాయి. అంతిమంగా రాజ‌కీయ అవ‌స‌రాలు వాళ్లు ఉద్దేశంలో గెల‌వాలి. రైతులు మాత్రం ప్రాణాలు విడుస్తున్నారు. అదేమ‌ని ప్ర‌శ్నిస్తే..జై జ‌వాన్‌..జై కిసాన్ అంటూ నినాదం వినిపించ‌డం వ‌ర‌కు బీజేపీ ప‌రిమితం అవుతోంది. ఇప్ప‌టికైనా ఇలాంటి స్కాంల మీద చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ప్ర‌జ‌ల మ‌ధ్య బీజేపీ అభాసుపాలు కావ‌డం త‌ప్ప‌దు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • cm kcr
  • paddy issue

Related News

Amith Sha Bng

2029లోనూ బిజెపి ప్రభుత్వమే తేల్చి చెప్పిన అమిత్ షా

బిజెపి సిద్ధాంతాలతో సామాన్య ప్రజలు మమేకం కావడం వల్లే పార్టీ బలోపేతం అవుతోందని, ఇదే జోరుతో 2029లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్ షా ధీమా

    Latest News

    • సామాన్యులకు భారీ ఊరట! భారీగా తగ్గనున్న ప్యూరిఫైయర్లు

    • మద్యం కావాలంటూ తిరుపతిలో ఆలయంపైకి ఎక్కి మందుబాబు హల్చల్

    • మరోసారి తండ్రి అయిన ఆది సాయి కుమార్

    • వచ్చే నెలలో డీఎస్సీ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ కసరత్తులు ?

    • దావోస్, యూఎస్ పర్యటనకు సీఎం రేవంత్

    Trending News

      • ఈరోజు సూపర్ మూన్ ఎన్ని గంటలకంటే !!

      • గోరఖ్‌పుర్‌ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు

      • యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..

      • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

      • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd