KTR: చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యం: కేటీఆర్
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేరారు.
- By Gopichand Published Date - 12:33 PM, Wed - 27 March 24
KTR: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేరారు. రంజిత్ రెడ్డి ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదు. మన పార్టీ సీటు ఇచ్చి, గెలిపించుకున్న తర్వాతనే రంజిత్ ముఖం ప్రపంచానికి తెలిసిందన్నారు. 2019లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చామన్నారు. అంతేకాకుండా నియోజక వర్గంలో స్వేచ్చ కూడా ఇచ్చామని అన్నారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయను అని పార్టీ ముందు అశక్తతను వ్యక్త్యం చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ఎంపీ రంజిత్ రెడ్డి చెప్పినట్లు గుర్తుచేశారు. కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి బీఆర్స్ పార్టీని విడిచి ద్రోహం చేశారని మండిపడ్డారు. పార్టీ సీనియర్ నాయకురాలు… రంజిత్ రెడ్డి తన సోదరి అని చెప్పుకునే కవితపైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి… అరెస్టు చేసిన రోజే.. ఆయన నవ్వుకుంటూ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడు అని విమర్శలు చేశారు.
బిఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని, పార్టీకి మోసం చేసి వెళ్ళాడు అని చర్చించుకుంటున్నారని అన్నారు. గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసని అన్నారు. ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరని అన్నారు అదే నిజమైతే దేశంలో పార్టీలు ఉండవు. స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Also Read: Jagan and Sharmila: షర్మిల మీద జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదా..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి మనుసులు కలిసినంత మాత్రాన… మిలాఖత్ అయినంత మాత్రనా.. కాంగ్రెస్.. బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొని ఉందన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ.. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమని కేటీఆర్ అన్నారు.
We’re now on WhatsApp : Click to Join
చేవెళ్ల నియోజకవర్గంలో 13వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులతోపాటు బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా అండగా నిలబడిన వ్యక్తి అని కేటీఆర్ చెప్పారు. ఒకవైపు బీసీల కోసం పాటుపడుతూనే, మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకుపోయిన మంచి మనిషి, నాయకుడు కాసాని అని కేటీఆర్ అన్నారు. సామాజిక సమీకరణాల రీత్యా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుందని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేశారు.
Related News
AP Politics : దేశంలోనే ఏపీ ఎన్నికలు ఖరీదైనవా…? 20 వేల కోట్లు అంట..!
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల కంటే తక్కువ సమయం ఉండటంతో, ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు పంపిణీ చేయడానికి తమ డబ్బు సంచులను బయటకు తీయడం ప్రారంభించాయి.