HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Impossible For Congress To Win These 3 Constituencies Ktr

KTR: చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలవడం అసాధ్యం: కేటీఆర్

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన‌ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేరారు.

  • Author : Gopi Date : 27-03-2024 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR
Ktr Warning To Congress Gov

KTR: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన‌ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేరారు. రంజిత్ రెడ్డి ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదు. మన పార్టీ సీటు ఇచ్చి, గెలిపించుకున్న తర్వాతనే రంజిత్ ముఖం ప్రపంచానికి తెలిసిందన్నారు. 2019లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చామ‌న్నారు. అంతేకాకుండా నియోజక వర్గంలో స్వేచ్చ కూడా ఇచ్చామ‌ని అన్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయను అని పార్టీ ముందు అశక్తతను వ్యక్త్యం చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ఎంపీ రంజిత్ రెడ్డి చెప్పిన‌ట్లు గుర్తుచేశారు. కేవలం అధికారం, ఆస్తుల‌ కోసమే రంజిత్ రెడ్డి బీఆర్‌స్ పార్టీని విడిచి ద్రోహం చేశారని మండిప‌డ్డారు. పార్టీ సీనియర్ నాయకురాలు… రంజిత్ రెడ్డి తన సోదరి అని చెప్పుకునే కవితపైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి… అరెస్టు చేసిన రోజే.. ఆయన నవ్వుకుంటూ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడు అని విమ‌ర్శ‌లు చేశారు.

బిఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని, పార్టీకి మోసం చేసి వెళ్ళాడు అని చర్చించుకుంటున్నారని అన్నారు. గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసని అన్నారు. ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరని అన్నారు అదే నిజమైతే దేశంలో పార్టీలు ఉండవు. స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Also Read: Jagan and Sharmila: షర్మిల మీద జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదా..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి మనుసులు కలిసినంత మాత్రాన… మిలాఖత్ అయినంత మాత్రనా.. కాంగ్రెస్.. బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమ‌ని ఫైర్ అయ్యారు. ఎంపీ ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొని ఉందన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ.. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమ‌ని కేటీఆర్ అన్నారు.

We’re now on WhatsApp : Click to Join

చేవెళ్ల నియోజకవర్గంలో 13వ తేదీన మాజీ సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులతోపాటు బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా అండగా నిలబడిన వ్యక్తి అని కేటీఆర్ చెప్పారు. ఒకవైపు బీసీల కోసం పాటుపడుతూనే, మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకుపోయిన మంచి మనిషి, నాయకుడు కాసాని అని కేటీఆర్ అన్నారు. సామాజిక సమీకరణాల రీత్యా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుందని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Lok Sabha Elections
  • brs
  • Chevella
  • congress
  • ktr
  • malkajgiri
  • secunderabad

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM: కేరళం సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

కేరళ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఘన విజయం సాధించడంతో పదేళ్ల విరామం తర్వాత తిరిగి అధికారంలోకి వస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గ

    Latest News

    • Physical Relations: శారీరక సంబంధాలపై సర్వే.. షాకింగ్ విషయాలు వెల్లడి!

    • VIJAYAWADA : బెజ‌వాడ థార్ కారు కేసు.. ఇద్దరికీ రిమాండ్

    • Vastu Tips: ఆర్థిక సమస్యలు తొలగాలంటే… ఆదివారం నాడు ఇలా చేయండి..!!

    • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

    • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

    Trending News

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd