Telangana Congress : కాంగ్రెస్ లో వరుస చేరికలు.. ఆయా జిల్లాలో నేతలు కలిసి పని చేసేనా..?
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తరువాత తెలంగాణలో అధికారంపై కన్నేసింది. ఎలాగైన తెలంగాణలో గెలుపు రుచి చూడాలిని
- By Prasad Published Date - 12:34 PM, Tue - 18 July 23
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తరువాత తెలంగాణలో అధికారంపై కన్నేసింది. ఎలాగైన తెలంగాణలో గెలుపు రుచి చూడాలిని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలు ఎలాంటి వారైనా సరే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడటం లేదు. మరోవైపు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇతర పార్టీల్లోని పలువురు కాంగ్రెస్ తో టచ్ లోకి వస్తున్నారు. కొత్తగా చేరుతున్న వారికి సీట్ల పైన హామీలు దక్కుతున్నాయి. ఇది పార్టీనే నమ్ముకొని అంకితభావంతో ఉన్న నేతల్లో పలు సందేహాలకు కారణమవుతోంది. ఇంత కాలం తమను ఇబ్బంది పెట్టిన నేతలు ఇప్పుడు తమ పార్టీలోకి రావటం పైన పలు చోట్ల సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీరిని పార్టీ ఎలా సమన్వయం చేస్తుంది? సీట్ల విషయంలో అనుసరించే ఫార్ములా ఏంటి? ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది? ఇవ్వలేని వారికి ఎలా న్యాయం చేస్తుంది? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రధాన చర్చగా మారింది.
కాంగ్రెస్ లో చేరికల ప్రవాహం పెరిగింది. కాంగ్రెస్ కే అధికారం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ప్రజలు సైతం కాంగ్రెస్ కే మద్దతుగా నిలుస్తారనేది క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్. దీంతో పార్టీలోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంతనాలు జోరుగా సాగుతున్నాయి. అందరూ కాంగ్రెస్ సీటు కావాలనే షరతు పెడుతున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించి ప్రత్యర్ధి పార్టీలను దెబ్బ తీయాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం వచ్చే వారికి హామీలు గుప్పిస్తుంది. కొత్త వారు చేరికలు అవసరమే అయినా..పాత వారికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో పని చేసిన వారు తమ నియోజకవర్గాల్లో సీట్లపైన ఆశలు పెట్టుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో కొత్త నేతలను చేర్చుకునే క్రమంలో సీట్ల హామీలు ఇస్తుండటం వారికి రుచించటం లేదు. దీంత పార్టీకి ఈ వ్యవహారం సమస్యగా మారుతోంది.
ఉమ్మడి మహబూబ్ నగరంలోని కొల్లాపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో చేరికలపైన నాగం జనార్ధనరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దామోదర్ రెడ్డి తన కుమారుడికి సీటు పైన హామీ కోరారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు సిద్దమయ్యారని తెలుస్తుంది. తన వర్గానికి సీట్లపైన హామీ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం జిల్లాలోని పార్టీ నేతలకు అంతుచిక్కటం లేదు. ఖమ్మం జిల్లాలో పాత, కొత్త నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొని ఉంది. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం తిరిగి పార్టీలో చేరటమే కాక సీటు పైన కూడా ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో సీతక్క కుమారుడు అక్కడ చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సమయంలో వారికి ఇస్తున్న హామీలతో పార్టీనే నమ్ముకున్న నేతల్లో ఆందోళన కనిపిస్తోంది.
Related News
SSC: పదో సప్లిమెంటరీ షెడ్యూల్ రిలీజ్.. వివరాలివే
SSC: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు.తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విడుదల చేసింది. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన�