తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద హై టెన్షన్..
- Author : Vamsi Chowdary Korata
Date : 16-02-2026 - 12:54 IST
Published By : Hashtagu Telugu Desk
కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్యలు ఎక్స్అఫీషియోలుగా పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. డ్రా ద్వారా ఎన్నికను నిర్వహించే అవకాశముంది.
అయితే కడియం కావ్య ఇదివరకే వరంగల్లో ఎక్స్అఫీషియోగా నమోదు చేసుకున్నారని, ఇప్పుడు మళ్లీ తొర్రూరులో ఎలా చేసుకుంటారని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. వారిమధ్య తోపులాట జరిగింది.
ఆ సమయంలో అక్కడకు కడియం కావ్య, యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి పీఏపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కడియం కావ్య రెండుచోట్ల ఎక్స్ అఫీషియోగా నమోదు చేయించుకోవడంపై బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
Tags
- errabelli dayakar rao
- Kadiyam Kavya
- MAHABUBABAD
- Mahabubabad district
- Mahabubabad MLA
- MLA Yashaswini Reddy
- MP Kadiyam Kavya
- Palakurthy MLA Yashaswini Reddy
- Telangana Municipal Elections
- telangana municipal elections 2026
- telangana municipal elections results
- thorrur
- Thorrur Municipal Election Results
- Yashaswini Reddy