Group 1 : గ్రూప్ -1 ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేసింది.. చెక్ చేయడం ఇలా
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రిజల్ట్ రిలీజ్ అయ్యాయి.
- By Pasha Published Date - 01:42 PM, Sun - 7 July 24

Group 1 : తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రిజల్ట్ రిలీజ్ అయ్యాయి. దీంతోపాటే ప్రిల్సిమ్స్ తుది కీ కూడా ఇవాళే విడుదలైంది. ప్రిలిమ్స్ పరీక్ష నుంచి గ్రూప్-1 మెయిన్స్కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారని టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్ ఫలితాలను తమ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని అభ్యర్థులకు సూచించింది.
We’re now on WhatsApp. Click to Join
ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత తుదికీని విడుదల చేశామని వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1(Group 1) మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షకు వారం ముందు నుంచే అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. వాస్తవానికి గ్రూప్ -1 (Group 1) ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని జూన్ 13న టీజీపీఎస్సీ(TGPSC) విడుదల చేసింది. ప్రిలిమినరీ కీతో పాటు ప్రశ్నపత్రాన్ని అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచింది.
Also Read : Food Packets : ఫుడ్ ప్యాకెట్లపై పోషకాల సమాచారం పెద్ద అక్షరాల్లో..
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై టీజీపీఎస్సీ నాలుగు రోజుల క్రితమే కీలక ప్రకటన చేసింది. మెయిన్స్ పరీక్ష కోసం అభ్యర్థులను 1:50 నిష్ఫత్తి ప్రకారమే ఎంపిక చేస్తామని వెల్లడించింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక సాధ్యమయ్యే విషయం కాదని టీజీపీఎస్సీ తేల్చి చెప్పింది. ఈమేరకు ఒక మెమోను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ జీఏడీ విభాగం జారీ చేసిన జీవోల ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది.
Also Read :Telugu States : సరైన దిశలో ఒక అడుగు..!
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో మొత్తం 6 పేపర్లు ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ పేపర్) పరీక్ష అక్టోబర్ 21న, పేపర్-I (జనరల్ ఎస్సే) పరీక్ష అక్టోబర్ 22న, పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) పరీక్ష అక్టోబర్ 23న, పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) పరీక్ష అక్టోబర్ 24న, పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) పరీక్ష అక్టోబర్ 25న, పేపర్- V (సైన్స్ అండ్ సాంకేతికత, డేటా ఇంటర్ప్రిటేషన్ ) పరీక్ష అక్టోబరు 26న, పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) పరీక్ష అక్టోబర్ 27న జరుగుతుంది.