Indiramma Houses Scheme : మాట మార్చిన ప్రభుత్వం..లబ్ధిదారులు ఆందోళన
Indiramma Houses Scheme : ముందుగా తమకు నచ్చిన విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకోవచ్చని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, తాజాగా అధికారులు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లకే ఆర్థిక సాయం అందుబాటులో ఉంటుందని స్పష్టంచేశారు
- Author : Sudheer
Date : 29-04-2025 - 10:14 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం (Indiramma Housing Scheme)పై లబ్ధిదారుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందుగా తమకు నచ్చిన విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకోవచ్చని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, తాజాగా అధికారులు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లకే ఆర్థిక సాయం అందుబాటులో ఉంటుందని స్పష్టంచేశారు. దీంతో ఇప్పటికే పెద్ద ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Vitamin E Capsule: ముఖానికి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
ప్రస్తుత పరిస్థితుల్లో మొదటి విడతలో 70,122 ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అయితే వీరిలో దాదాపు 2,800 మంది లబ్ధిదారులు పునాది పనులు ప్రారంభించగా, 300 మంది లబ్ధిదారులు 600 చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంలో ఇళ్లు నిర్మిస్తున్నారు. అధికారులు తాజాగా నిబంధనలు మార్చి, నిర్ణీత పరిమితికి మించిన నిర్మాణానికి మద్దతు లేదని ప్రకటించడంతో, ఇప్పటికే ఖర్చు చేసిన లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అధికారుల ఆదేశాలతో నిరాశ చెందిన లబ్ధిదారులు తమ న్యాయం కోసం వివిధ మార్గాల్లో ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ప్రారంభంలో ఇచ్చిన హామీ ప్రకారం నిధులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మార్పులతో పథకంపై నమ్మకం తగ్గిపోవచ్చని, దీని వల్ల పథకం ఉద్దేశ్యమే ప్రమాదంలో పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం త్వరగా స్పష్టమైన నిర్ణయం తీసుకొని లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.