HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Future Belongs To Artificial Intelligence Says Cm Revanth Reddy

Artificial intelligence (AI) : భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే – సీఎం రేవంత్

Artificial intelligence (AI) : రాష్ట్రంలో AI విస్తరణను బలోపేతం చేసేందుకు మైక్రోసాఫ్ట్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది

  • Author : Sudheer Date : 13-02-2025 - 2:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Artificial Intelligence Say
Artificial Intelligence Say

భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence (AI)) ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను తెలంగాణలో ప్రారంభించింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో కొత్త ఫెసిలిటీ ప్రారంభించడం రాష్ట్ర అభివృద్ధికి గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఆయన తెలిపారు.

Honey: కాలిన గాయాలు మొటిమలు మాయం అవ్వాలంటే తేనెతో ఈ విధంగా చేయాల్సిందే!

మైక్రోసాఫ్ట్-తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో AI విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో AI విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు, పబ్లిక్ సర్వీసెస్‌లో AI వినియోగాన్ని ప్రోత్సహించనున్నారు. దీనిద్వారా విద్యార్థులకు నూతన అవకాశాలు లభించడంతో పాటు, ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరగనుంది. మైక్రోసాఫ్ట్, తెలంగాణ ప్రభుత్వం కలిసి AI సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్ ఆధునిక AI పరిశోధన, డేటా సెంటర్లు, క్లౌడ్-ఆధారిత మౌలిక సదుపాయాలతో నైపుణ్యాలను పెంపొందించనుంది. ఈ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 1.2 లక్షల మందికి పైగా AI శిక్షణ అందించనున్నారు.

రాష్ట్రంలో AI విస్తరణను బలోపేతం చేసేందుకు మైక్రోసాఫ్ట్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. AI పరిశ్రమలో యువతకు శిక్షణ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాలు విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులు అనే మూడు విభాగాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. తెలంగాణలో మైక్రోసాఫ్ట్ విస్తరణతో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా, రాష్ట్రం ఒక గ్లోబల్ AI హబ్‌గా మారనుంది. దీనివల్ల టెక్నాలజీ రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI
  • Artificial Intelligence
  • CM Revanth Reddy
  • hyderabad

Related News

Hyd Gitam University

గీతం యూనివర్సిటీకి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

హైకోర్టు ఆదేశాలతో HYD గీతం యూనివర్సిటీకి అధికారులు కరెంట్ నిలిపివేశారు. దీంతో 8వేల మంది స్టూడెంట్స్ నష్టపోతున్నారని వర్సిటీ మరోసారి కోర్టుకు వెళ్లింది. రూ.118 కోట్ల బకాయిల్లో సగం కడితేనే కరెంట్ కనెక్షన్ పునరుద్ధరణకు

  • Harish Rao Warning

    నీ చరిత్ర ఇది రేవంత్ – హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

  • మొన్న నిధి అగర్వాల్, నేడు సమంత ఏంటి ఈ ‘చిరాకు’ అభిమానం

  • Harish Rao

    రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు

  • CM Revanth Leadership

    రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్

Latest News

  • ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య

  • మీ సామాన్లు చూపించడం మానేసి, చక్కగా చీర కట్టుకోండి అంటూ హీరోయిన్ల పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

  • కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైన సిట్?

  • జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..

  • సొసైటీల ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ?

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd