HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Former Minister Jagdish Reddys Comments On The Congress Govt

Jagdish Reddy: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి (Jagdish Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోట‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్‌తో కలిసి గురువారం ఉద‌యం ప‌రిశీలించారు.

  • By Gopichand Published Date - 04:53 PM, Thu - 4 April 24
  • daily-hunt
Jagadish Reddy
Safeimagekit Resized Img (3) 11zon

Jagdish Reddy: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి (Jagdish Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోట‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్‌తో కలిసి గురువారం ఉద‌యం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దుర‌దృష్ట‌వశాత్తు ప‌రిపాల‌న అనేదే అడ్ర‌స్ లేకుండా పోయిందని విమ‌ర్శించారు. అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ నాయ‌కులు ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌ట‌మే స‌రిపోతుంద‌న్నారు. అధికారులు ఎవ‌రి ప‌నుల్లో వారే ఉన్నారు. ప్ర‌జ‌ల‌ను మాత్రం గాలికి వ‌దిలేశార‌ని ఆరోపించారు. సాగునీటి నిర్వ‌హణ‌, తాగు నీటి నిర్వ‌హ‌ణ అధ్వానంగా త‌యారైంద‌ని అన్నారు.

2014కు ముందు ఉన్న రోజులు పునరావృతం అవుతున్నాయన్నారు. 2014కు ముందు నాగార్జున సాగ‌ర్‌లో నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితులు రాష్ట్రంలో చూస్తాన‌మ‌న్నారు. కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ప్రభుత్వం ప్రజలను, పాలనను గాలికి వదిలేసిందని, సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమ‌ర్శించారు. నాగార్జునసాగర్‌ను మున్సిపాలిటీగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Also Read: Emergency Landing: లడఖ్‌లో ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

తెలంగాణ‌లో అవినీతికి పాల్ప‌డి ఢిల్లీకి డ‌బ్బు పంపే ప‌నిలో ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం బిజీగా ఉంద‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై దృష్టి పెట్టి వారికి తాగునీరు అందించేలా కార్య‌చ‌ర‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. కేసీఆర్ బ‌య‌టికి రాగానే ప్రాజెక్టుల నుంచి నీళ్ల‌ను బ‌య‌ట‌కు వదిలార‌ని మాజీ మంత్రి గుర్తుచేశారు. అంతేకాకుండా ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించే వాట‌ర్ ట్యాంకుల‌ను తనిఖీ చేసే స‌మ‌యం కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి కానీ అధికారులు కానీ లేద‌న్నారు.

2014కు ముందు ఉన్న రోజులు పునరావృతం అవుతున్నాయి

నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.

ప్రభుత్వం ప్రజలను,పాలనను గాలికి… https://t.co/SB6zy21ppO pic.twitter.com/7XXiGFgYK3

— Telugu Scribe (@TeluguScribe) April 4, 2024

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలోని వాటర్‌ ట్యాంకులో పడి 30 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. 200 ఇళ్లకు తాగునీరు సరఫరా చేసేలా ఈ ట్యాంకు నిర్మించి పైన రేకులు వేశారు. కాగా, ఎండలు మండిపోతుండటంతో నీళ్లు తాగేందుకు ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలు కోల్పోయాయి. కోతులు మరణించిన విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

We’re now on WhatsApp : Click to Join


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Jagadish Reddy
  • kcr
  • Nalgonda
  • telangana

Related News

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

  • Cctv Camera In Bathroom

    CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

  • Supreme Court expresses deep anger over dog attacks on Delhi streets

    42% Backward Class Quota : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు భారీ దెబ్బ

  • Jubilee Hills Bypoll Exit P

    Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

Latest News

  • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

  • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

  • TTD: తిరుమ‌ల శ్రీవారి భక్తుల‌కు శుభ‌వార్త‌..!

Trending News

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd