HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Former Minister Jagdish Reddys Comments On The Congress Govt

Jagdish Reddy: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి (Jagdish Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోట‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్‌తో కలిసి గురువారం ఉద‌యం ప‌రిశీలించారు.

  • By Gopichand Published Date - 04:53 PM, Thu - 4 April 24
  • daily-hunt
Jagadish Reddy
Safeimagekit Resized Img (3) 11zon

Jagdish Reddy: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి (Jagdish Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోట‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్‌తో కలిసి గురువారం ఉద‌యం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దుర‌దృష్ట‌వశాత్తు ప‌రిపాల‌న అనేదే అడ్ర‌స్ లేకుండా పోయిందని విమ‌ర్శించారు. అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ నాయ‌కులు ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌ట‌మే స‌రిపోతుంద‌న్నారు. అధికారులు ఎవ‌రి ప‌నుల్లో వారే ఉన్నారు. ప్ర‌జ‌ల‌ను మాత్రం గాలికి వ‌దిలేశార‌ని ఆరోపించారు. సాగునీటి నిర్వ‌హణ‌, తాగు నీటి నిర్వ‌హ‌ణ అధ్వానంగా త‌యారైంద‌ని అన్నారు.

2014కు ముందు ఉన్న రోజులు పునరావృతం అవుతున్నాయన్నారు. 2014కు ముందు నాగార్జున సాగ‌ర్‌లో నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితులు రాష్ట్రంలో చూస్తాన‌మ‌న్నారు. కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ప్రభుత్వం ప్రజలను, పాలనను గాలికి వదిలేసిందని, సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమ‌ర్శించారు. నాగార్జునసాగర్‌ను మున్సిపాలిటీగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Also Read: Emergency Landing: లడఖ్‌లో ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

తెలంగాణ‌లో అవినీతికి పాల్ప‌డి ఢిల్లీకి డ‌బ్బు పంపే ప‌నిలో ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం బిజీగా ఉంద‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై దృష్టి పెట్టి వారికి తాగునీరు అందించేలా కార్య‌చ‌ర‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. కేసీఆర్ బ‌య‌టికి రాగానే ప్రాజెక్టుల నుంచి నీళ్ల‌ను బ‌య‌ట‌కు వదిలార‌ని మాజీ మంత్రి గుర్తుచేశారు. అంతేకాకుండా ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించే వాట‌ర్ ట్యాంకుల‌ను తనిఖీ చేసే స‌మ‌యం కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి కానీ అధికారులు కానీ లేద‌న్నారు.

2014కు ముందు ఉన్న రోజులు పునరావృతం అవుతున్నాయి

నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.

ప్రభుత్వం ప్రజలను,పాలనను గాలికి… https://t.co/SB6zy21ppO pic.twitter.com/7XXiGFgYK3

— Telugu Scribe (@TeluguScribe) April 4, 2024

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలోని వాటర్‌ ట్యాంకులో పడి 30 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. 200 ఇళ్లకు తాగునీరు సరఫరా చేసేలా ఈ ట్యాంకు నిర్మించి పైన రేకులు వేశారు. కాగా, ఎండలు మండిపోతుండటంతో నీళ్లు తాగేందుకు ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలు కోల్పోయాయి. కోతులు మరణించిన విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

We’re now on WhatsApp : Click to Join


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Jagadish Reddy
  • kcr
  • Nalgonda
  • telangana

Related News

Election Schedule

Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు ఒక పరీక్షగా నిలవనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి.

  • Wine Shops Closed Dasara Oc

    Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

  • Kcr Metting

    KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • Jublihils Bypolls Brs Candi

    Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Group-1 Candidates

    Group-1 Candidates: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. ఈనెల 27న నియామక పత్రాలు అంద‌జేత‌!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd