HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Fiber Net Md Chairman Controversy Telangana

Fibernet : ఫైబర్‌నెట్‌లో పెరుగుతున్న వివాదం.. చైర్మన్ జీవీ రెడ్డి vs ఎండీ దినేశ్‌కుమార్

Fibernet : తెలంగాణ ఫైబర్‌నెట్‌ సంస్థలో పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ కుమార్‌పై రాజద్రోహం ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదంపై ప్రభుత్వం స్పందించి, నిజానిజాలు బయటకు తేల్చేందుకు రెండు వైపుల నుంచి ఆధారాలతో కూడిన వివరణ కోరింది. మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఈ వ్యవహారంలో నడుం బిగించారు.

  • Author : Kavya Krishna Date : 22-02-2025 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fibernet
Fibernet

Fibernet : ఫైబర్‌నెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినేశ్‌కుమార్‌పై ఆ సంస్థ చైర్మన్‌ జీవీ రెడ్డి చేసిన రాజద్రోహం ఆరోపణలు ప్రభుత్వాన్ని గందరగోళంలోకి నెట్టాయి. ఈ వివాదం పెరిగిపోకుండా, వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించింది. దీనిలో భాగంగా, సంస్థ చైర్మన్‌ జీవీ రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినేశ్‌ కుమార్‌లను వ్యక్తిగతంగా వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. గురువారం నాడు జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు శుక్రవారం నాటికి పత్రికల్లో ప్రధానంగా ప్రచారం కావడంతో, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో, దీనిపై స్పష్టతను తీసుకురావాల్సిన బాధ్యతను మంత్రి బీసీ జనార్దన రెడ్డికి అప్పగించారు.

ప్రభుత్వం ఆదేశాల ప్రకారం, మంత్రి బీసీ జనార్దన రెడ్డి శుక్రవారం ఉదయమే రంగంలోకి దిగారు. ప్రభుత్వ అధికారులతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపిన అనంతరం, నేరుగా జీవీ రెడ్డిని ప్రశ్నించారు. “ఎందుకు మీడియా ముందు ఫైబర్‌నెట్‌ ఎండీ దినేశ్‌కుమార్‌పై రాజద్రోహం ఆరోపణలు చేశారని” అడిగారు. దీనికి జీవీ రెడ్డి తన వాదనను వివరించారు. గత కొంతకాలంగా దినేశ్‌కుమార్‌ తనకు సహకరించడం లేదని, తన ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వాట్సాప్‌ సందేశాల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేశారని తెలిపారు. చట్టపరమైన నియామక పత్రాలు లేని 410 మంది ఉద్యోగులను తొలగించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలుగా వారిని కొనసాగిస్తూ జీతభత్యాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. అంతేగాక, ఇన్‌కమ్‌టాక్స్‌, జీఎస్టీ వంటి ఆర్థిక అంశాలపైనా స్పష్టమైన ఆరోపణలు చేశారు. ఈ విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, మౌలిక సదుపాయాల కార్యదర్శి యువరాజ్‌లకు కూడా వివరించానని మంత్రి దృష్టికి తెచ్చారు. ఫైబర్‌నెట్‌ను ఆర్థికంగా పటిష్టంగా మార్చాలంటే, ఎండీ దినేశ్‌కుమార్‌ను బదిలీ చేయాలని జీవీ రెడ్డి సూచించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో, మంత్రి జనార్దన రెడ్డి జీవీ రెడ్డిని ఆధారాలతో కూడిన నివేదిక సమర్పించమని ఆదేశించారు. వెంటనే స్పందించిన జీవీ రెడ్డి, తన ఆధారాలతో కూడిన నివేదికను శుక్రవారం మధ్యాహ్నానికి అందజేశారు.

శుక్రవారం మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాయంలో మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డిని ఫైబర్‌నెట్‌ ఎండీ దినేశ్‌ కుమార్‌ కలిశారు. ఈ సమావేశానికి ఐ అండ్‌ ఐ కార్యదర్శి యువరాజ్‌ కూడా హాజరయ్యారు. మంత్రి జనార్దన్ రెడ్డి, “మీకు, చైర్మన్‌కు మధ్య విబేధాలు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వ శాఖల కీలక వ్యక్తులు మీడియా ఎదుట ఆరోపణలు చేస్తే ప్రభుత్వ ప్రతిష్ఠ ఏమవుతుందో ఆలోచించారా?” అంటూ ప్రశ్నించారు. దీనికి దినేశ్‌కుమార్‌ తన వాదన వినిపించారు. “గతంలో జీఎస్టీ వ్యవహారాలను చూసిన కన్సల్టెన్సీ సంస్థ ఫీజును తీసుకుంటున్నందున, చెల్లింపుల బాధ్యత ఆ సంస్థదే,” అని వివరించారు. ఆదాయపు పన్ను విషయంలోనూ ఇదే వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఆయన వివరణను విన్న మంత్రి, లిఖితపూర్వకంగా ఆధారాలతో కూడిన నివేదికను సమర్పించమని ఆదేశించారు. దినేశ్‌కుమార్‌ కూడా దీనికి అంగీకరించి, శనివారం నాటికి నివేదిక అందజేస్తానని చెప్పారు.

ఈ పరిణామాలు రాజకీయ , పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను చైర్మన్లు మీడియా ఎదుట విమర్శించడం, పరిపాలనా విధానంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. కొందరు కార్పొరేషన్‌ ఎండీలు, “చైర్మన్లు అధికారాలను తమ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే, ఎండీలుగా రాజకీయ నేతలను నియమించుకోవచ్చు కదా?” అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, “మేము కార్యనిర్వాహణ అధికారాలను కోరుకోవడం లేదు,” అంటూ చైర్మన్లు సమర్థించుకుంటున్నారు.

ఫైబర్‌నెట్‌ వివాదం, అధికారుల మధ్య విభేదాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా, మీడియా ముందు వ్యక్తిగత ఆరోపణలు చేయడం, పరిపాలనా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు శాశ్వత పరిష్కారానికి దారి తీస్తాయా? లేక మరిన్ని చర్చలకు దారి తీస్తాయా? అనేది చూడాల్సి ఉంది.

Read Also : IPS Officers: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Corruption allegations
  • Dinesh Kumar
  • fiber net
  • fiber net chairman
  • fiber net controversy
  • fiber net md
  • government inquiry
  • GV Reddy
  • Political Dispute
  • telangana fiber net
  • telangana government
  • telangana politics

Related News

Telangana Legislators Sports Meet 2026

Azharuddin: ఎల్బీ స్టేడియంలో సిక్సులతో చెలరేగిన మంత్రి అజారుద్దీన్..

Mohammad Azharuddin భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ సొగసరి బ్యాటర్ మహమ్మద్ అజారుద్దీన్ చాలా కాలం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించి, వరుస సిక్సర్లు బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2026’లో భాగంగా ఆదివారం ఈ ఆసక్తికర పోరు జరిగింద

  • Kalvakuntla Kavitha New Party in April

    Kavitha New Party: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Teenmaar Mallanna Padayatra

    Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న పాదయాత్ర

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

Latest News

  • Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd