Telangana: తెలంగాణాలో బీజేపీ గాలి వీస్తుంది: బండి
తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈరోజు విలేకరులతో బండి సంజయ్ మాట్లాడుతూ
- By Praveen Aluthuru Published Date - 06:36 PM, Wed - 11 October 23
Telangana: తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈరోజు విలేకరులతో బండి సంజయ్ మాట్లాడుతూ.. రాయితీలన్నీ ఎత్తివేసి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిడని ఆరోపించారు. కౌలు రైతులకు ఎలాంటి ఆసరా ఇవ్వలేదని, వాళ్ళేం పాపం చేశారని ప్రశ్నించారు. బీజేపీని తట్టుకోలేక టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందన్నారు. కేసీఆర్ టూరిస్టులా దేశమంతా తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు .
బీసీ బంధు పథకం అందరికీ ఇవ్వలేదని, సొంత పార్టీ కార్యకర్తలకే ఇచ్చారని బండి సంజయ్ అన్నారు . రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల అవినీతి, దౌర్జన్యాలను తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చే పార్టీగా బీజేపీని చూస్తామన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ సడక్ యోజన , జాతీయ రహదారి రోడ్లు, రైల్వేలు, రైతు వేదిక కింద రోడ్లకు నిధులు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు . రేషన్ బియ్యం పంపిణీ, శ్మశాన వాటికలు, గ్రామ పంచాయతీల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తోందన్నారు.
స్మార్ట్ సిటీ, మున్సిపాలిటీలకు కేంద్రం నిధులు ఇస్తోందని, ఇళ్లు నిర్మించకుండా పేద ప్రజలను ఎవరు మోసం చేస్తున్నారని, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిర్మాణాలు చేపట్టలేదన్నారు. గ్రామపంచాయతీలు, కార్పొరేషన్లకు కేంద్రం ఇస్తున్న నిధులు చూపించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్రం మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేస్తోందన్నారు.
Also Read: Telangana: కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
Related News
BRS Party: కెసిఆర్ ఓటమిని గ్రామీణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు : అల్లిపూరం
BRS Party: కొడంగల్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపూరం వెంకటేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గంలో 25 రోజులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించామని, గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ను ఓడించినందుకు కెసిఆర్ ఓటమిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నానని, కొడంగల్ న