Road Accidents: ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
ఖమ్మం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదాలు (Road Accidents) చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లా వైరా పట్టణం రింగ్ రోడ్డు సెంటర్ లో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటన శనివారం జరిగింది.
- By Gopichand Published Date - 10:11 AM, Sat - 25 March 23
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు (Road Accidents) చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లా వైరా పట్టణం రింగ్ రోడ్డు సెంటర్ లో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటన శనివారం జరిగింది. సత్తుపల్లికి చెందిన రంగా సుభాష్, రోజా దంపతులు వైరా రింగ్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సత్తుపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న సుభాష్, రోజా దంపతులు స్థానిక వైరా రింగ్ సెంటర్ రాగానే వెనుక నుంచి వచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కాగా వీరు హైదరాబాద్ లో కిరాణా షాప్ నడుపుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ ఫ్లైఓవర్పై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ మీద ఉన్న రెయిలింగ్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముదిగొండ మండలం మేడిపల్లికి చెందిన పంగిళ్ల ఉదయ్ కుమార్, పోతునూక శివ, పోలగాని రవీంద్ అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మేడిపల్లి నుంచి ఖమ్మం చర్చి కాంపౌండ్కు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Related News
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో వ