HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Farmers Festival In Telangana

Farmers’ Festival : దశాబ్దం నిర్లక్ష్యం తర్వాత తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం వచ్చింది

Farmers’ Festival : తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తిచేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు (Farmers’ Festival) చేప‌డుతోంది. మొత్తం ఐదు రోజుల పాటు ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు

  • Author : Sudheer Date : 28-11-2024 - 1:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Farmers Festival In Telangana
Farmers Festival In Telangana

దశాబ్దం నిర్లక్ష్యం తర్వాత తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం వచ్చింది. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తిచేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు (Farmers’ Festival) చేప‌డుతోంది. మొత్తం ఐదు రోజుల పాటు ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ (Mahabubnagar) లో నేటి నుండి రైతు పండ‌గ నిర్వ‌హిస్తున్నారు. ఓ స‌భ‌లా కాకుండా ఉత్స‌వంలా నిర్వ‌హిచాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్ప‌టికే అధికారుల‌ను ఆదేశించడం తో అధికారులు దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేసారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో ఉచిత కరెంట్ , మహిళలకు ఫ్రీ బస్సు , రైతుల రుణమాఫీ వంటి కీలక హామీలు ఇప్పటికే అమలు చేయడం తో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 22,22,000 మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది. అలాగే “ఫైన్ రైస్” కోసం రూ. 500 బోనస్ గులాబీ పాలనలో ఎన్నడూ లేని విధంగా రైట్‌లను సుసంపన్నం చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రథమ వార్షికోత్సవాన్ని రైతుల సంక్షేమంలో మైలురాయిగా చాటుకుంటూ రూ. 54,280 కోట్లను వివిధ పథకాల కోసం ఖర్చు చేయడాన్ని హైలైట్ గా చెప్పొచ్చు. రైతుల కోసం కాంగ్రెస్ చేసిన ఖర్చు చూస్తే..

పంట రుణాల మాఫీ: రూ. 17,869 కోట్లు
రైతు బంధు పథకం: రూ.7,625 కోట్లు
రైతు బీమా (బీమా ప్రీమియం): రూ. 1,455 కోట్లు
పంట బీమా ప్రీమియం చెల్లింపు: రూ. 1,300 కోట్లు
వ్యవసాయానికి ఉచిత విద్యుత్: రూ.10,444 కోట్లు
రబీ 2023-24లో ధాన్యం కొనుగోలు: రూ.10,547 కోట్లు
ఖరీఫ్ 2024లో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు: రూ. 5,040 కోట్లు ఖర్చు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ముందున్న పథకాలన్నింటిని కొనసాగించడమే కాకుండా కొత్తగా రైతు నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఇది రైతులకు వివిధ పంటలపై సలహాలు, సిఫార్సులు అందించేందుకు ఉపయోగపడుతుంది. సూపర్ ఫైన్ ధాన్యం క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇవ్వడం వల్ల బంపర్ క్రాప్ సాధ్యమైంది. అలాగే నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక రైతు పండ‌గ ఉత్స‌వాల్లో రైతుల‌కు వ్య‌వ‌సాయం గురించి కొత్త విష‌యాలు చెప్పడం, ఆధునిక ప‌ద్దుతుల్లో వ్య‌వ‌సాయం చేయడం, లాభ‌సాటి వ్య‌వ‌సాయం లాంటి అంశాల‌పై అవ‌గాహన కల్పించనున్నారు. ఈ ఉత్స‌వాల సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 30 మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు రానున్నారు.

Great news! #Telangana

After a neglect of a decade, #Farmer welfare tops focus of government. Revanth Reddy govt gives highest support for farmers

– Loan waiver for over 22,22,000 farmers

– Rs 500 bonus for “fine rice” enriches ryots unlike ever during pink regime… pic.twitter.com/zfHX6QozDr

— Sriram Karri (@oratorgreat) November 28, 2024

Read Also : Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ పిటిషన్ పై విచారణ వాయిదా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • Farmers Festival in Telangana
  • mahabubnagar

Related News

Survey

ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

    Latest News

    • మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం, తొలి బహిరంగ సభ అక్కడే !!

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

    • విపక్ష ఎంపీల ఆందోళన – 8 మంది ఎంపీల సస్పెండ్

    • కావాలనే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు – రాహుల్

    • మజ్లిస్ పార్టీలో విషాదం..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత !

    Trending News

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

      • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

      • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

      • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd