Telangana: తెలంగాణలో పేలుడు కలకలం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
- By Gopichand Published Date - 08:24 AM, Sun - 11 December 22
నిజామాబాద్ పెద్ద బజార్లో పేలుడు (Explosion) సంభవించింది. భారీ శబ్ధం రావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ షాపు ఎదుట కెమికల్ బాటిల్ పేలింది. ఈ ఘటనలో శంకర్ అనే వ్యక్తి గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. పేలుడు (Explosion)కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్ చౌరస్తా ప్రాంతంలోని వైన్స్ వద్ద శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలోని షాపుల రేకులు ఎగురిపోయాయి. పేలుడు శబ్దం అరకిలో మీటర్ వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. కాగా స్థానికంగా ఉండే ఓ వ్యక్తి కెమికల్ బాక్స్ ఓపెన్ చేస్తుండగా పేలుడు సంభవించిందని అంటున్నారు. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గుర్తించి 108కి సమాచారం అందించి చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Ganja : హైదరాబాద్లో నలుగురు గంజాయి వ్యాపారుల అరెస్ట్
Related News
Movie Theaters: ఈనెల 17 నుంచి తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్..!
తెలంగాణ రాష్ట్రంలోని సినీ ప్రియులకు షాక్ తగలనుంది.