DK Aruna : ఆరు హమీలతో తెలంగాణ ప్రజలను ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంది : బీజేపీ నాయకురాలు డీకే అరుణ
ఆరు హామీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
- By Prasad Published Date - 09:32 PM, Tue - 19 September 23
ఆరు హామీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చిందా అని ఆమె కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నించారు. కర్ణాటక హమీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ .. హమీల మేరకు రూ.4000 పెన్షన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఆర్టీసీ పరిస్థితి దారుణంగా తయారైందని, అందుకే కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరించాలని చూస్తోందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే మూడు హామీలు ఇవ్వాలని ఆమె కోరారు.గెలిచే ఎమ్మెల్యేలు పార్టీ మారబోమని, కుంభకోణాలు చేయబోమని, తెలంగాణ చరిత్రను తప్పుదోవ పట్టించబోమనే హమీలు ఇవ్వాలని కాంగ్రెస్ నేతల్ని డిమాండ్ చేశారు.
భారత్ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ కాంగ్రెస్, మిత్రపక్షాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. దేశంపై కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందని అన్నారు.తెలంగాణ సీఎంపై కేసీఆర్ పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించే అలవాటు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేదన్నారు. బీఆర్ ఎస్ కమిటీల్లో ఎక్కడైనా మహిళలకు కీలక బాధ్యతలు ఇస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తాను కష్టపడి పనిచేశానని, ఆ ప్రాజెక్టు విషయంలో తనను గౌరవించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Related News
SSC: పదో సప్లిమెంటరీ షెడ్యూల్ రిలీజ్.. వివరాలివే
SSC: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు.తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విడుదల చేసింది. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన�