Telangana: మైనార్టీలపై కాంగ్రెస్ గురి
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
- By Praveen Aluthuru Published Date - 03:51 PM, Sun - 8 October 23
Telangana: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలోని మైనార్టీలకు కాంగ్రెస్ అండగా ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పొరుగున ఉన్న కర్ణాటకలో మైనారిటీలు కాంగ్రెస్కు మద్దతిచ్చారని , అందుకే రాష్ట్రంలో ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ కు మైనారిటీలు అండగా ఉండాలని కోరారు రేవంత్.
తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ జోస్యం చెప్పారని, రాష్ట్రంలో కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారని టీపీసీసీ చీఫ్ అన్నారు. ఈ అంచనా నిజమైతే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి బీజేపీ , బీఆర్ఎస్లు చేతులు కలిపాయని ఆయన అన్నారు. అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్లు పొత్తు పెట్టుకోవడం లేదని అందరికి తెలుసని రేవంత్ చెప్పారు. తెలంగాణాలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: PM Kisan Removals : ‘పీఎం కిసాన్’ నుంచి భారీగా లబ్ధిదారుల తొలగింపు.. మీ పేరుందా ?
Related News
Casting Multiple Votes: బీజేపీ అభ్యర్థికి 8 సార్లు ఓటు వేసిన వీడియో వైరల్
ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఒకే వ్యక్తి పలు ఓట్లు వేసినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు యువ ఓటరును అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ మరియు సమాజ్వాదీ పార్టీతో సహా అనేక మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేసి