HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanths New Demand New Formula In Cwc Meeting

CM Revanth New Demand: సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో సీఎం రేవంత్ న‌యా డిమాండ్‌!

రేవంత్ రెడ్డి ప్రతిపాదన మేర‌కు సీడ‌బ్ల్యూసీ ఏక‌గ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. త్వ‌ర‌లో చేప్ట‌ట‌నున్న నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లోనూ ఏఐసీసీ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

  • Author : Gopichand Date : 27-12-2024 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Government
Telangana Government

CM Revanth New Demand: జ‌న గ‌ణ‌న‌లో కుల గ‌ణ‌న చేప‌ట్టాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌తిపాదించారు. కుల గ‌ణ‌న‌లో తెలంగాణ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని సీఎం (CM Revanth New Demand) తెలిపారు. బెళ‌గావిలో గురువారం జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. కులగణన చేప‌ట్ట‌డం ద్వారా తెలంగాణ దేశానికే మార్గదర్శిగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది దేశ‌వ్యాప్తంగా చేప‌ట్ట‌నున్న జ‌న గ‌ణ‌న‌లో కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ పోరాటం చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఈ విష‌యంలో సీడ‌బ్ల్యూసీ ఒక తీర్మాన‌ చేసి కేంద్ర ప్ర‌భుత్వానికి పంపించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

రేవంత్ రెడ్డి ప్రతిపాదన మేర‌కు సీడ‌బ్ల్యూసీ ఏక‌గ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. త్వ‌ర‌లో చేప్ట‌ట‌నున్న నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లోనూ ఏఐసీసీ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. జనాభా ప్రాతిపదికన నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేస్తే ద‌క్షిణాది రాష్ట్రాలు ఎక్కువ‌గా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విష‌యంలో ఏఐసీసీ వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రించి అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాలన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళా బిల్లు కొలిక్కి వ‌చ్చిన నేప‌థ్యంలో దానిపై కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ‌గా ప్ర‌చారం చేయాల్సి ఉంద‌ని సీఎం సూచించారు. మ‌హిళా బిల్లు విష‌యంలోనూ బీజేపీ రిజర్వేషన్లను త‌న‌కు అనుకూలంగా చేసుకునే అవ‌కాశాలున్నందున కాంగ్రెస్ అత్యంత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం అన్నారు.

Also Read: Manmohan Singh: మ‌న్మోహ‌న్ సింగ్ మృతి ప‌ట్ల రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం.. ఈ రాష్ట్రంలో సెల‌వు!

కుల గ‌ణ‌న‌తో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు: మ‌హేశ్ కుమార్ గౌడ్‌, పీసీసీ అధ్య‌క్షులు

రాహుల్ గాంధీ ఆలోచనలతో చేపట్టాలని నిర్ణయించిన కులగణన తో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఇది దేశం అంత స్వాగతించాల్సిన అంశమని అన్నారు. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించి పాలిస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ కుటిల రాజకీయ ఎత్తుగడలకు కులగణన చెంపపెట్టు లాంటిదని అన్నారు.

కులగణనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దానిని ప్రారంభించడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బెళ‌గావి సీడబ్ల్యూసీ స‌ద‌స్సులో ఆయ‌న ప్ర‌సంగించారు. అత్యంత పకడ్బందీగా అన్ని వర్గాల ఆలోచనలను స్వీకరించి ఒక అద్భుతమైన ప్రశ్నావళి రూపొందించి తెలంగాణ‌లో కుల గ‌ణ‌న సర్వే చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికే 90 శాతం పూర్త‌యింద‌ని ఆయ‌న చెప్పారు.

బీజేపీ రాజ్యాంగాన్ని, చరిత్ర ను తిరగరాయలని చూస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇలాంటి తరుణంలో దేశానికి సేవలు, త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర కారుల, త్యాగ పురుషుల జీవితాలను నేటి తరానికి వివరించాల్సి ఉంద‌ని పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సరిగ్గా వంద ఏళ్ల క్రితం ఇదే బెళ‌గావిలో మహాత్మా గాంధీని సీడబ్ల్యూసీ ఏఐసీసీ అధ్య‌క్షునిగా ఎన్నుకుంద‌నియ ఆయ‌న గుర్తు చేశారు. ఆ త‌ర్వాత కాలంలో ఏ ప‌ద‌విని స్వీక‌రించ‌కపోయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ‌మంతా నేటికీ ఆయ‌న సిద్ధాంతాల‌ను అనుస‌రించ‌డానికి ఆయ‌న పాటించిన విలువ‌లు, ఆద‌ర్శ‌ప్రాయ‌మైన జీవ‌న‌మే కార‌ణ‌మ‌ని పీసీసీ అధ్య‌క్షుడు కొనియాడారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • cwc meeting
  • Karnataka CWC Meeting
  • telangana
  • telugu news
  • TPCC President Mahesh Kumar Goud

Related News

Farmersurea

యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?

రైతులు ఇంటి వద్ద నుంచే యూరియా బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం 'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్'ను తీసుకొచ్చింది. ఇప్పటికే 10 జిల్లాల్లో ఇది అందుబాటులోకి రాగా, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది

  • Harish Rao

    రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు

  • CM Revanth Leadership

    రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్

  • Maoists Khali

    తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

Latest News

  • మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

  • హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

  • సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో, రేవంత్ పై బీజేపీ కౌంటర్

  • ప్రపంచంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు ఏవి ? ఎక్కడ ఉన్నాయి ?

  • ట్రైన్ టికెట్ చార్జీల పెంపుపై ప్రయాణికులు ఆగ్రహం, ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd