TRS MLAs Poaching Case: ఆ ఇద్దరూ మళ్లీ అరెస్ట్!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజురోజుకూ మలుపులు తిరుగుతోంది.
- By Balu J Published Date - 04:56 PM, Thu - 8 December 22
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case) లో మరోసారి ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు. రామచంద్ర భారతి తో నంద్ కుమార్ను చంచల్గూడ సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన బంజారాహిల్స్ పోలీసులు (Police) అరెస్టు చేశారు. లెక్కకుమించి పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు కలిగి ఉన్నందుకు రామచంద్ర భారతిపై కేసు బుక్ చేయగా, నంద్ కుమార్పై చీటింగ్, ఇతర నేరాలకు ఐదు కేసులు నమోదయ్యాయి.
ముగ్గురు నిందితులకు తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 1న బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరి పూచీకత్తులు, రూ.3 లక్షల వ్యక్తిగత పూచీకత్తు ఏర్పాటు చేయలేక వారం రోజుల పాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది. సింగయాజీ ను బుధవారం విడుదల చేశారు.
అతనిపై పోలీసులు గతంలో ఫోర్జరీ కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారని కేసు నమోదు చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన పూజారి రామచంద్ర భారతికి కొందరు బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ((TRS MLAs Poaching Case)) మరోసారి అరెస్ట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
Also Read: Tahsildar Suicide: అల్లూరి జిల్లాలో తహసీల్దార్ ఆత్మహత్య!
Related News
TS : జూన్ 9 నుండి చేప ప్రసాదం పంపిణిః బత్తిని కుటుంబం వెల్లడి
Fish Prasadam: ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ(Battini family) సభ్యులు చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణి కార్యక్రమం సాగుతుందని బత్తిని కుటుంబం వెల్లడించింది. హైదరాబాద్(Hyderabad)లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్(Exhibition Ground)లో చేపప్రసాదం అందిస్తామని వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా బత్తిని కుటుంబం వారు తెలి�