Also Read :Space Docking : జయహో ఇస్రో.. జంట ఉపగ్రహాల స్పేస్ డాకింగ్ సక్సెస్
పీవీ ఫొటోలలో..
- మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వెదురు కుర్చీపై కూర్చున్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోను కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేశారు.
- రాష్ట్రపతి భవన్లోకి దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ యంగ్ సామ్ను అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతో పీవీ నర్సింహారావు స్వాగతిస్తున్న మరో ఫొటోను ఏర్పాటు చేశారు.
- దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో పీవీ నర్సింహారావు దేశ రక్షణ మంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో రాజీవ్గాంధీతో, పీవీ దిగిన ఫొటోను కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇదే ఫొటోలో వారిద్దరితో పాటు యువకుడిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు.