Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన
'వికసిత్ భారత్' లక్ష్యంగా సాగుతున్న ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. దేశవ్యాప్తంగా 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించగా, అందులో ఏకంగా మూడు కారిడార్లు హైదరాబాద్ను
- Author : Sudheer
Date : 01-02-2026 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
Budget 2026 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026 తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్కు భారీ తీపి కబురు అందించింది. ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా సాగుతున్న ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. దేశవ్యాప్తంగా 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించగా, అందులో ఏకంగా మూడు కారిడార్లు హైదరాబాద్ను అనుసంధానిస్తూ ఉండటం విశేషం. ఇది దక్షిణ భారతదేశంలో రవాణా రంగాన్ని మరియు వాణిజ్యాన్ని విప్లవాత్మక మార్పులకు గురిచేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్కు అగ్రతాంబూలం – 3 కీలక కారిడార్లు
దేశంలో ప్రకటించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది.
హైదరాబాద్-బెంగళూరు: దేశంలోని రెండు ఐటీ హబ్లను అనుసంధానిస్తూ ఈ కారిడార్ సాగనుంది.
పుణే-హైదరాబాద్: పారిశ్రామిక మరియు రవాణా పరంగా ఈ మార్గం ఎంతో కీలకం.
హైదరాబాద్-చెన్నై: దక్షిణ భారత్ లోని మరో ప్రధాన నగరంతో వేగవంతమైన ప్రయాణానికి ఇది దోహదపడుతుంది. ఈ హైస్పీడ్ రైళ్ల వల్ల గంటల ప్రయాణం నిమిషాల్లోకి మారుతుందని, ఇది పరోక్షంగా రియల్ ఎస్టేట్ మరియు ఐటీ రంగానికి మరింత ఊతమిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఆర్థిక వృద్ధి – రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు
భారత్ ప్రస్తుతం 7 శాతం వృద్ధి రేటుతో స్థిరమైన ఆర్థిక ప్రయాణాన్ని కొనసాగిస్తోందని నిర్మలమ్మ తన ప్రసంగంలో వెల్లడించారు. ఈ ఆర్థిక బలానికి నిదర్శనంగా జనవరి నెలలో నమోదైన రూ. 1,93,384 కోట్ల జీఎస్టీ వసూళ్లను ఆమె ప్రస్తావించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 6.2 శాతం వృద్ధిని సూచిస్తోంది. దేశీయంగా పెరిగిన డిమాండ్, దిగుమతుల ద్వారా వస్తున్న ఆదాయం వల్లే ఇది సాధ్యమైందని, ఈ నిధులను దేశ భద్రత మరియు యువ శక్తి సంక్షేమం కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.