JANASENA : పవన్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఫైర్.. ప్యాకేజీ ఇస్తే..?
- Author : Prasad
Date : 03-06-2026 - 9:04 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జడ్యర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ ఆయనకే మద్దతు ఇస్తారన్నారు. జైలులో చంద్రబాబు నాయుడును కలవడమే పవన్కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ అని అనిరుధ్ రెడ్డి అన్నారు.పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాను ఆశిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి తెలిపారు.తెలంగాణను విమర్శించే వ్యక్తి ఇక్కడికి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. సినీ రంగంలో ఏ సినిమా ఎక్కువ పారితోషికం ఇస్తే అందులో నటించినట్లే, రాజకీయాల్లో కూడా ఎక్కువ ప్రయోజనం కల్పించే వారికే మద్దతు ఇస్తారని పవన్పై ఆరోపణలు చేశారు. హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటూ, విజయవాడకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులతో రాజకీయాలు చేస్తున్నారా అని ప్రశ్నించిన అనిరుధ్ రెడ్డి, భూ వివాదాలపై పవన్ కళ్యాణ్కు పూర్తి అవగాహన లేదని అన్నారు. భూముల అంశంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అలాగే తెలంగాణలో ఆయన రాజకీయ పాత్ర ఏమిటి, ఎవరికి మద్దతుగా ఇక్కడికి వస్తున్నారో ప్రజలకు వివరించాలని కోరారు.