HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >29 Flood Affected Districts In The State Cs Shanti Kumari

CS Shanti Kumari: రాష్ట్రంలో 29 వరద ప్రభావిత జిల్లాలు: సీఎస్

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, వికాస్ రాజ్ లతోపాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

  • Author : Gopichand Date : 07-09-2024 - 7:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Instructions Of CS
Instructions Of CS

CS Shanti Kumari: తెలంగాణ‌ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వ‌ల‌న‌ 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) తెలిపారు. ఇప్పటికే నాలుగు జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి వెంటనే తగు సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు నిధులను సంబంధిత జిల్లా కలెక్టర్లకు విడుదల చేయడం జరిగిందని, అదేవిధంగా మిగిలిన 25 జిల్లాలకు మూడు కోట్ల రూపాయల చొప్పున సంబంధిత జిల్లా కలెక్టర్లకు నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై సవివర నివేదికను సోమవారం మధ్యాహ్నంలోగా సమర్పించాలని కోరుతూ శుక్ర‌వారం రాత్రి జిల్లా కలెక్టర్లతో సి.ఎస్. టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, వికాస్ రాజ్ లతోపాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీల మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల నమోదైన వర్షపాతం ఆధారంగా ఈ 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటించినట్టు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మినహా అన్ని జిల్లాలను వర్ష ప్రభావిత జిల్లాలుగా ప్రకటించినట్టు వివరించారు. ఈ జిల్లాలకు వెంటనే తగు తక్షణ పునరావాస చర్యలను చేపట్టేందుకు జిల్లాకు మూడు కోట్ల రూపాయలను విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని శాంతి కుమారి తెలిపారు.

Also Read: Central Govt Releases Rs. 3300 Cr : కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు – CM చంద్రబాబు

SDRF నియమ నిబంధనలను అనుసరించి ఈ నిధులను వ్యయం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై, చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు, అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన సోమవారం నాడు ఉన్నతస్థాయి సమావేశాన్నిఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వరదలు వర్షాల జరిగిన నష్టాల వివరాలను నిర్ణీత నమూనాలో సమర్పించేందుకుగాను జిల్లాల వారీగా సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది మరణించారని వీరికి ఎక్స్ గ్రేషియా అందించేందుకు వివరాలు పంపాలని తెలిపారు.

జిల్లాల వారీగా జరిగిన పంట నష్టం, పాడి పశువుల మరణాలు, ఇతర వ్యవసాయ సంబంధిత నష్టాల వివరాలతో పాటు దెబ్బతిన్న రాష్ట్ర, జిల్లా, పంచాయతీ రహదారుల వివరాలు, దెబ్బతిన్న కల్వర్టులు బ్రిడ్జిలు, పాఠశాల భవనాలు, తాగునీటి సరఫరా పైప్ లైన్ ల వివరాలతో కూడిన నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 29 Districts
  • CM Revanth Reddy
  • CS Shanti Kumari
  • flood-affected districts
  • floods
  • Shanti Kumari
  • telangana

Related News

Cm Revanth Speech Assembly

CM Revanth Reddy: అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్ ఉక్కుపాదం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ సంస్థ మంత్రి పొంగులేటిది కాదని చెప్పడం పచ్చి అబద్ధమని, ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు

  • Omkareshwara Temple

    Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

Latest News

  • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

  • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

  • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

  • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

  • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd