Realme 11 Pro Plus: మార్కెట్ లోకి మరో రియల్ మీ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదా
- By Nakshatra Published Date - 07:45 PM, Wed - 10 May 23
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా రియల్మీ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కాగా ఇప్పటికే రియల్ మీ 11 సిరీస్ను చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రియల్మీ 11 సిరీస్లో రియల్మీ 11 ప్రో ప్లస్ వేరియంట్ ను రియల్ మీ సంస్థ భారత మార్కెట్ లోకి విడుదల చేయనుంది.
అంతేకాకుండా ఈ ఫోన్ త్వరలో భారత్లోకి రానుందట. కాగా రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త హార్డ్వేర్తో పాటు కొన్ని ప్రత్యేక ఫీచర్లు కలిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఫోన్ రూ.30 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. ఇండియాలో ఈ ఫోన్ లెదర్ బ్యాక్, రౌండ్ రియర్ కెమెరా మాడ్యూల్తో వచ్చే అవకాశం ఉంది. మధ్యలో 200 మెగాపిక్సెల్ కెమెరాతో సామ్సంగ్ ఐసో సెల్ హెచ్పీ3 సెన్సార్ ఉంది.
ప్రైమరీ కెమెరా సెన్సార్ 4 ఎక్స్ లాస్లెస్ జూమ్, 20 ఎక్స్ మూన్ మోడ్ జూమ్ను అందించవచ్చు రెండూ హైబ్రిడ్ జూమ్ లేదా డిజిటల్ జూమ్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎమోఎల్ఈడీ స్క్రీన్, డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది. 12 జీబీ 256 జీబీ వేరియంట్లో వినియోగదారులకు ఉండనుంది అని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్సిఆర్లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.