Hyderabad
-
#Speed News
Hyderabad : హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్కు షాక్.. సిగిరెట్ తెమ్మని..?
హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్ని మోసగించి కార్తో దుండగుడు పరారైయ్యాడ. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక్కించుకున్నాడు. మేడిపల్లి ప్రాంతానికి చేరుకున్న తర్వాత నిందితుడు అకస్మాత్తుగా తనకు కాలు నొప్పిగా ఉందని […]
Date : 22-06-2026 - 12:35 IST -
#Telangana
ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !
కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్పూర్లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను ఆపాదించుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని స్పష్టంగా వెల్లడైంది. ఈ యువతీ యువకులు సమావేశాలకు […]
Date : 20-06-2026 - 5:44 IST -
#Speed News
Zepto : ఎక్స్పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్హౌస్లో సోదాలు
హైదరాబాద్లో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న జెప్టో (Zepto) వేర్హౌస్పై ఫుడ్ సెప్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన పలు ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో అనేక అవకతవకలు వెలుగుచూశాయి. […]
Date : 20-06-2026 - 7:22 IST -
#Telangana
Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధికార కూటమిలో భాగం కాగా.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జనసేన పార్టీ సభ నిర్వహణకు పోలీసులు, హైకోర్టు అనుమతులు ఇవ్వకపోవడం.. అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో.. వాటన్నింటికీ సమాధానంగా.. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్.. […]
Date : 19-06-2026 - 5:03 IST -
#Telangana
లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ
ఒక ఉబెర్ డ్రైవర్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో, ఒకప్పుడు అమెజాన్లో ఉద్యోగిగా పనిచేసిన ఆ డ్రైవర్, డ్రైవింగ్ పట్ల తనకున్న అభిరుచిని కొనసాగించడానికి ఉద్యోగాన్ని వదిలేశాడని వెల్లడైంది. హైదరాబాద్కు చెందిన ఆ వ్యక్తి, తన నగరాన్ని అన్వేషిస్తూనే వివిధ నగరాల ప్రజలను కలుసుకునేందుకు వీలు కల్పించే ఉబెర్లో చేరాడు. ఉద్యోగి అమెజాన్ను వదిలి ఉబెర్లో చేరాడు ఈ వీడియోను ఒక కంటెంట్ క్రియేటర్ షేర్ చేశారు. యూజర్ @chetnasingh___ ఇన్స్టాగ్రామ్లో […]
Date : 16-06-2026 - 1:11 IST -
#Telangana
ACB Raids: హైదరాబాద్లో ఏసీబీ సోదాల కలకలం
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని బృందాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో ఈ తనిఖీలు ప్రారంభించాయి. హైదరాబాద్లోని చత్రినాకలో ఉన్న నరహరి నివాసం, ఆయన కార్యాలయంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న మరో 11 […]
Date : 16-06-2026 - 11:06 IST -
#Telangana
Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో నైరుతి రుతుపవనాల గమనం ప్రస్తుతం కొంత మందకొడిగా సాగుతోందని, రాష్ట్రమంతటా ఇవి పూర్తిగా విస్తరించడానికి మరో ఐదు రోజుల సమయం పట్టవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే, బుధ, గురువారాల్లో ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే సోమవారం వికారాబాద్ జిల్లా రాపోలులో 4.4 సెం.మీ., నల్గొండ జిల్లా ఉరుమడ్లలో 3.1 సెం.మీ., నాగర్కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో 2.4 సెం.మీ. చొప్పున వర్షపాతం […]
Date : 16-06-2026 - 9:50 IST -
#Telangana
Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం
హైదరాబాద్ నగరంలో ఒక సంచలన మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సొంత సోదరి నమ్రత అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాన్ పరిసర ప్రాంతంలో నివసించే గద్వాల్ విజయలక్ష్మి సోదరి కె. నమ్రత (57) ఈ నెల 4న ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయటకు వెళ్లారు. అయితే, రోజులు గడుస్తున్నా ఆమె తిరిగి ఇంటికి […]
Date : 15-06-2026 - 2:01 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్
హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల […]
Date : 09-06-2026 - 11:32 IST -
#Speed News
Minior Girl : హైదరాబాద్లో మైనర్ బాలిక ఆత్మహత్య
హైదరాబాద్లో మైనర్ బాలిక ఆత్మహత్య ఘటన కలకలం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోందని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత.. ఈ విషాదానికి దారితీసిన పరిస్థితులను ఆ లేఖలో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. […]
Date : 02-06-2026 - 11:36 IST -
#Speed News
JSP : హైదరాబాద్లో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారని అంచనా. అయితే, ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగర పోలీసులు అనుమతి నిరాకరించారు.దీంతో జనసేన […]
Date : 01-06-2026 - 7:53 IST -
#Speed News
HYD : ఐపీఎల్ సంబరాలు.. హైదరాబాద్లో ఆర్సీబీ అభిమానుల రచ్చ.. పోలీసుల లాఠీఛార్జ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆర్సీబీ అభిమానులు రచ్చ చేశారు. దీంతో పోలీసులు అభిమానులపై లాఠీ ఝులిపించారు. ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ జట్టు విజయంతో అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి గుమిగూడారు. ఈ సంబరాల సమయంలో, అభిమానులు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించి, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తూ ట్రాఫిక్ నిలిపివేసిన అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి […]
Date : 01-06-2026 - 9:22 IST -
#Speed News
HYDRAA : పుప్పలగూడ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..
పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్ఎండిఏ రికార్డుల ప్రకారం ముష్కిన్ చెరువు 52.20 ఎకరాల ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) పరిధిలో ఉంది. గ్రామ రికార్డుల ప్రకారం […]
Date : 30-05-2026 - 6:04 IST -
#Speed News
IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనడానికి గాంధీ ఆస్పత్రి మరోసారి నిదర్శనంగా నిలిచింది. సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్లో ఉచితంగా చికిత్స పొందిన భువనగిరి జిల్లాకు చెందిన ఓ మహిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. రవి, సౌమ్య దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహమైనప్పటి నుంచి సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో వారు పలు ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో చికిత్స చేయించుకుని లక్షల […]
Date : 29-05-2026 - 5:06 IST -
#Speed News
Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
హైదరాబాద్కు చెందిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మే 23న మసాబ్ ట్యాంక్లోని తన నివాసం వెలుపల ఖాజా మొయిజుద్దీన్పై కారు దూసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతరం మృతి చెందారు. మొయిజుద్దీన్ కుమారుడు ఫర్హాన్ చేసిన ఫిర్యాదు మేరకు.. వక్ఫ్ భూములు వివాదాలకు సంబంధించి మహబూబ్ ఆలం […]
Date : 29-05-2026 - 4:57 IST