Hyderabad
-
#Speed News
Minior Girl : హైదరాబాద్లో మైనర్ బాలిక ఆత్మహత్య
హైదరాబాద్లో మైనర్ బాలిక ఆత్మహత్య ఘటన కలకలం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోందని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత.. ఈ విషాదానికి దారితీసిన పరిస్థితులను ఆ లేఖలో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. […]
Date : 02-06-2026 - 11:36 IST -
#Speed News
JSP : హైదరాబాద్లో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారని అంచనా. అయితే, ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగర పోలీసులు అనుమతి నిరాకరించారు.దీంతో జనసేన […]
Date : 01-06-2026 - 7:53 IST -
#Speed News
HYD : ఐపీఎల్ సంబరాలు.. హైదరాబాద్లో ఆర్సీబీ అభిమానుల రచ్చ.. పోలీసుల లాఠీఛార్జ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆర్సీబీ అభిమానులు రచ్చ చేశారు. దీంతో పోలీసులు అభిమానులపై లాఠీ ఝులిపించారు. ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ జట్టు విజయంతో అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి గుమిగూడారు. ఈ సంబరాల సమయంలో, అభిమానులు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించి, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తూ ట్రాఫిక్ నిలిపివేసిన అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి […]
Date : 01-06-2026 - 9:22 IST -
#Speed News
HYDRAA : పుప్పలగూడ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..
పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్ఎండిఏ రికార్డుల ప్రకారం ముష్కిన్ చెరువు 52.20 ఎకరాల ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) పరిధిలో ఉంది. గ్రామ రికార్డుల ప్రకారం […]
Date : 30-05-2026 - 6:04 IST -
#Speed News
IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనడానికి గాంధీ ఆస్పత్రి మరోసారి నిదర్శనంగా నిలిచింది. సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్లో ఉచితంగా చికిత్స పొందిన భువనగిరి జిల్లాకు చెందిన ఓ మహిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. రవి, సౌమ్య దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహమైనప్పటి నుంచి సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో వారు పలు ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో చికిత్స చేయించుకుని లక్షల […]
Date : 29-05-2026 - 5:06 IST -
#Speed News
Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
హైదరాబాద్కు చెందిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మే 23న మసాబ్ ట్యాంక్లోని తన నివాసం వెలుపల ఖాజా మొయిజుద్దీన్పై కారు దూసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతరం మృతి చెందారు. మొయిజుద్దీన్ కుమారుడు ఫర్హాన్ చేసిన ఫిర్యాదు మేరకు.. వక్ఫ్ భూములు వివాదాలకు సంబంధించి మహబూబ్ ఆలం […]
Date : 29-05-2026 - 4:57 IST -
#Speed News
HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్జెండర్లకు చోటు
సమాజంలో ఎన్నో ఏళ్లుగా వివక్ష, నిర్లక్ష్యానికి గురవుతున్న ట్రాన్స్జెండర్ సమాజానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కొత్త ఆశాకిరణంగా నిలిచింది. హైడ్రా ఏర్పాటు చేసిన ‘ఈగిల్ టీమ్’లో 16 మంది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. ఈ బృందంలో 11 మంది ట్రాన్స్ మహిళలు, 5 మంది ట్రాన్స్ పురుషులు ఉన్నారు. వీరు హైడ్రా సిబ్బందితో కలిసి ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, పార్కులు […]
Date : 29-05-2026 - 4:38 IST -
#Speed News
Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు
సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి పదార్థాలు, నాన్వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపలను సరైన విధంగా నిల్వ చేయకపోవడంతో వాటిని వెంటనే తొలగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే […]
Date : 28-05-2026 - 8:31 IST -
#Speed News
NTR : అమీర్పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అమీర్పేట్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఇటు టీడీపీ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరుకానున్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అమీర్ పేట చౌరస్తాలో ఎన్టీఆర్ […]
Date : 28-05-2026 - 8:18 IST -
#Speed News
Hawala Cash : దేవగిరి ఎక్స్ప్రెస్లో భారీ నగదు పట్టివేత.. హవాలా డబ్బుగా పోలీసుల అనుమానాం
దేవగిరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.1.22 కోట్ల అనుమానిత హవాలా నగదును రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ ప్రయానికుడి వద్ద నగదు పోలీసులు పట్టుకున్నారు.సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. అయితే ఆ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు వినియోగంపై స్పష్టమైన వివరాలు అతను ఇవ్వలేకపోయినట్లు అధికారులు తెలిపారు. […]
Date : 28-05-2026 - 7:57 IST -
#Speed News
Food Safety : మూసాపేటలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. రెస్టారెంట్లో బయటపడిన షాకింగ్ లోపాలు
సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రత పర్యవేక్షణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మూసాపేటలోని ఓ రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆందోళనకర అంశాలు బయటపడటంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. తనిఖీల సమయంలో వంటగది నేల జారుడుగా ఉండటం, డ్రైనేజీ వ్యవస్థలో ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, వండిన వెజ్ బిర్యానీ, అన్నం, పన్నీర్, మంచూరియా, పిండి పదార్థాలను సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అలాగే వంటగది పరిసరాల్లో […]
Date : 27-05-2026 - 12:47 IST -
#Speed News
Accident : హైదరాబాద్ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబిన్లో చిక్కుకున్న లారీ డ్రైవర్
హైదరాబాద్ హయత్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుపోగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలతో అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ వాహనం టైరు పగిలిపోవడంతో హయత్నగర్ సమీపంలో రోడ్డుపై నిలిచిపోయింది. కొద్ది సేపటికే పంజాగుట్ట వైపు వెళ్తున్న టిప్పర్ వాహనం ఆగి ఉన్న కంటైనర్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రతకు టిప్పర్ క్యాబిన్ […]
Date : 27-05-2026 - 12:35 IST -
#Speed News
HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు
సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రత ప్రమాణాలను పర్యవేక్షించే చర్యల్లో భాగంగా సీఎంసీ (CMC) ఫుడ్ సేఫ్టీ బృందాలు మాధాపూర్లోని ఒక రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో పలు ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సమయంలో సిబ్బంది ఏప్రాన్లు, హెయిర్నెట్స్ ధరించి పరిశుభ్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. మరోవైపు ఆహార నిల్వలు, భద్రత విషయంలో పలు లోపాలను గుర్తించారు. మాంసాన్ని అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ చేయడం, వెజ్-నాన్ వెజ్ ఆహార పదార్థాలను ఒకే ఫ్రీజర్లో […]
Date : 25-05-2026 - 9:50 IST -
#Speed News
Car Race : హైటెక్ సిటీ వీధుల్లో కార్ రేసర్లు హల్చల్.. పోలీసులపైకి..?
వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్లో అర్థరాత్రి బైక్, కార్ రేసర్లు హల్చల్ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో అర్థరాత్రులు యువత రోడ్లపై ఖరీదైన బైక్లు, కార్లు వేసుకుని రయ్యిరయ్యిమంటూ రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. బైక్ , కార్లతో రేసులు పెట్టుకుని రోడ్లపై ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఐటీ హబ్ – నీలోఫర్ కేఫ్ ప్రాంతంలో యువకులు కార్ల రేసింగ్లు చేశారు. ఈ ఘటనను చూసిన పెట్రోలింగ్ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిగా .. పోలీసులపైకి యువకుడు కారును దూసుకెళ్లాడు. […]
Date : 24-05-2026 - 12:35 IST -
#Telangana
Hyderabad: ఫాస్ట్ఫుడ్ తింటున్నారా? జాగ్రత్త రక్తపోటు వచ్చే ఛాన్స్ ఉందంటున్న నిపుణులు
ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల హైదరాబాద్ నగరంలోని యువతలో రక్తపోటు (బీపీ) సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్కు చెందిన ‘ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్’ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే విద్యార్థుల్లో ఇతరుల కంటే బీపీ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. విద్యార్థులపై సర్వే హైదరాబాద్లోని వివిధ కాలేజీలకు […]
Date : 23-05-2026 - 4:04 IST