నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయర్గా కోహ్లీ?
ఈ ఐపీఎల్ సీజన్లో కోహ్లీ బ్యాట్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 57 సగటుతో, 158.33 స్ట్రైక్ రేట్తో మొత్తం 228 పరుగులు చేశాడు.
- Author : Gopi
Date : 18-04-2026 - 12:58 IST
Published By : Hashtagu Telugu Desk
Virat Kohli: గత బుధవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఐపీఎల్ 2026 23వ లీగ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మొదటిసారిగా ఇంపాక్ట్ ప్లేయర్గా కనిపించాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా మైదానంలోకి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్తో జరగబోయే మ్యాచ్లో కూడా కోహ్లీ ఇంపాక్ట్ ప్లేయర్గానే ఆడతారా అనే ప్రశ్న తలెత్తుతోంది. లక్నోతో మ్యాచ్కు ముందు ఏప్రిల్ 12న ముంబై ఇండియన్స్తో జరిగిన పోరులో కోహ్లీ ఫీల్డింగ్ చేయడానికి మైదానంలోకి రాలేదు. కోహ్లీకి మడమ సంబంధిత సమస్య ఉన్నట్లు తెలిసింది. తాను పూర్తిగా ఫిట్గా లేనని స్వయంగా కోహ్లీ కూడా మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.
ఢిల్లీతో మ్యాచ్లో కోహ్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడా?
ఈ మ్యాచ్కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో బెంగళూరు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్.. కోహ్లీ ఫిట్నెస్పై కీలక అప్డేట్ ఇచ్చాడు. కోహ్లీ ఈ మ్యాచ్లో ఆడతారని హేజిల్వుడ్ ధృవీకరించాడు. అయితే కోహ్లీ నేరుగా ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదా ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
Also Read: నేటి బంగారం ధరలివే.. పెరిగాయా? తగ్గాయా?
హేజిల్వుడ్ మాట్లాడుతూ.. “అతను (విరాట్ కోహ్లీ) ఖచ్చితంగా ఆడతాడు. అయితే మైదానంలో అతను ఎంతవరకు సహకరించగలడనేదే ముఖ్యం. కోహ్లీ జట్టులోకి గొప్ప ఎనర్జీని తెస్తాడు. అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడు. అతను పూర్తిస్థాయిలో జట్టులోకి రావాలని మేము కోరుకుంటున్నాము. నాకు తెలిసినంతవరకు కోహ్లీ ఖాళీగా కూర్చునే రకం కాదు. అతను ఎల్లప్పుడూ ఆటలో భాగస్వామి కావాలని, తన ప్రభావం చూపాలని కోరుకుంటాడు” అని తెలిపాడు.
ఈ సీజన్లో కోహ్లీ అద్భుత ప్రదర్శన
ఈ ఐపీఎల్ సీజన్లో కోహ్లీ బ్యాట్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 57 సగటుతో, 158.33 స్ట్రైక్ రేట్తో మొత్తం 228 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్నాడు.