CSK vs PBKS: ఐపీఎల్ లో నేడు ఆసక్తికరమైన పోరు.. ధోనీ సేనను ధావన్ సేన అడ్డుకోగలదా..?
ఐపీఎల్ 2023లో నేడు (ఏప్రిల్ 30) చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య పోరు జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
- By Gopichand Published Date - 09:55 AM, Sun - 30 April 23
ఐపీఎల్ 2023లో నేడు (ఏప్రిల్ 30) చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య పోరు జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 3. 30 గంటల నుంచి ప్రారంభం కానుంది. పంజాబ్తో జరిగే మ్యాచ్లో గెలిచి మరోసారి టేబుల్ పాయింట్లలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఎంఎస్ ధోనీ జట్టు కోరుకుంటోంది. అదే సమయంలో CSKని ఓడించి ప్లేఆఫ్కు వెళ్లాలనే ఆశను నిలుపుకోవాలనేది శిఖర్ ధావన్ జట్టు ఉద్దేశం.
ఈ మ్యాచ్లో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగనుంది. చెన్నై, పంజాబ్ జట్టులో ఆటగాళ్ల మధ్య మ్యాచ్ సమయంలో ఆసక్తికరమైన పోటీ కనిపించనుంది. గత మ్యాచ్లో ఇరు జట్లు ఓడిపోయినప్పటికీ సీఎస్కే, పంజాబ్ల మధ్య ఈ మ్యాచ్లో హోరాహోరీ పోరు కనిపించనుంది. ఏప్రిల్ 27న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఏప్రిల్ 28న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్ పంజాబ్ కింగ్స్పై 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. CSK జట్టు నాలుగో స్థానంలో,పంజాబ్ జట్టు ఆరో స్థానంలో ఉంది.
Also Read: SRH vs DC: ఎట్టకేలకు సన్ రైజర్స్ గెలుపు బాట… హైస్కోరింగ్ గేమ్ లో ఢిల్లీపై విజయం
చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లోని అనేక ఛానెల్లలో చూడవచ్చు. ఇది అనేక భాషలలో ప్రసారం చేయబడుతుంది. ఇది కాకుండా JIO CINEMA యాప్కు సబ్స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా వారి మొబైల్ ఫోన్లలో మ్యాచ్ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.
Tags
Related News
IPL 2024: ధోనీ కంటే ఫాస్ట్ బౌలర్ బెటర్.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్
IPL 2024: ధోనీ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. సాధారణంగా మ్యాచ్ చివరి 1-2 ఓవర్లలో బ్యాటింగ్కు వస్తాడు. కానీ ఐపీఎల్ 2024 53వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. దీంతో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. MS ధోన్ మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్లకు తనకంటే ముందు బ్యాటింగ్ చేయడానిక�