Viratball: ఇంగ్లండ్కు కౌంటర్ ఇచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్.. భారత్ లో విరాట్ బాల్ ఉందని కామెంట్స్..!
ఇంగ్లండ్ బేస్బాల్కు పోటీగా భారత్కు విరాట్బాల్ (Viratball) ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్లో అన్నారు.
- By Gopichand Published Date - 12:30 PM, Sun - 21 January 24
Viratball: జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. ఇందుకోసం ఇంగ్లండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ జనవరి 25 నుంచి హైదరాబాద్లో జరగనుంది. దీని కోసం ప్రస్తుతం టీమ్ఇండియా ముమ్మరంగా సిద్ధమవుతోంది. ఈ సిరీస్లో ఇరు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొననుంది. ఇంగ్లండ్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో చాలా దూకుడుగా ఆడుతోంది. ఇది ఇంగ్లాండ్ జట్టు కోచ్
బ్రెండన్ మెక్కలమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ సహకారంతో జరుగుతోంది.
ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్లో ‘బేస్బాల్’ క్రికెట్ ఆడుతుంది. భారత జట్టుతో జరగనున్న టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ ‘బేస్బాల్’ క్రికెట్ మరోసారి కనిపించబోతోంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇంగ్లండ్కు ధీటుగా సమాధానమిచ్చాడు.
భారత్లో ‘విరాట్బాల్’ ఉంది
న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్మెన్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ కోచ్ అయినప్పటి నుంచి టెస్టు క్రికెట్లో ఆ జట్టు దూకుడు ప్రదర్శన కనపడుతోంది. ఇది ఇంగ్లండ్ జట్టుకు ఎంతో మేలు చేసింది. ఇప్పుడు భారత పిచ్లపై దూకుడు, సానుకూల క్రికెట్ ఆడడం ఇంగ్లండ్కు పూర్తి భిన్నమైన సవాలుగా మారనుంది.
Also Read: Sarfaraz Ahmed: దేశం వదిలి వెళ్లిన పాకిస్థాన్ వికెట్ కీపర్.. కారణమిదేనా..?
ఇంగ్లండ్ బేస్బాల్కు పోటీగా భారత్కు విరాట్బాల్ (Viratball) ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్లో అన్నారు. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. విరాట్ బ్యాటింగ్ తీరు, అతని బ్యాటింగ్లో మంచి కదలిక ఉందని చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇంగ్లండ్కు అంత సులభం కాదు
భారత్-ఇంగ్లండ్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ భారత పిచ్లపైనే జరగనుంది. భారత పిచ్లపై బేస్బాల్ క్రికెట్ను అమలు చేయడం ఇంగ్లండ్కు అంత సులభం కాదు. భారత పిచ్లపై స్పిన్నర్లు చాలా మలుపులు తిప్పుతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత జట్టులో రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లకు జట్టులో చోటు కల్పించారు. ఇది ఇంగ్లండ్ను చాలా ఇబ్బంది పెట్టనుంది. దక్షిణాఫ్రికాలో భారత జట్టు తన చివరి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. అందుకే టీమిండియాలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంది.
Related News
IPL 2024: విరాట్ vs శశాంక్ సింగ్
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ క్రికెట్లో తిరుగులేని ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. గతేడాదితో భీకర ఫామ్ మైంటైన్ చేసిన విరాట్ ఈ ఏడాదిలోనూ అదే స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో విరాట్ 4 హాఫ్ సెంచరీలు చేశాడు