Virat Kohli: ప్లే ఆఫ్ అవకాశాలపై కోహ్లీ కామెంట్స్
ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్ తొలి రెండు స్థానాలు ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఖాయం చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం.. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి.
- By Hashtag U Published Date - 03:35 PM, Fri - 20 May 22
ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్ తొలి రెండు స్థానాలు ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఖాయం చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం.. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి. ఇందులో మెరుగైన రన్ రేటుతో ముందువరుసలో ఉన్న రాజస్థాన్ రాయల్స్కి కూడా మూడో బెర్తు దక్కడం ఖాయమని చెప్పొచ్చు. ఇక మిగిలిన ఒక బెర్తు ఆర్సీబీ టీమ్.. ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి.
అయితే శనివారం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 69వ లీగ్ మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధిస్తే దర్జాగా ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెడుతుంది. అప్పుడు నాలుగో స్థానములో ఉన్న ఆర్సీబీ ప్లే ఆప్స్ రేసు నుండి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు ఇప్పుడు ముంబయి ఇండియన్స్ విజయంపై ఆధారపడి ఉండటంపై బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ తో మ్యాచ్ ముగిసాక కోహ్లీ మాట్లాడుతూ.. రెండు రోజులు ప్రశాంతంగా ఉందాం.. అలాగే ముంబయి ఇండియన్స్ గెలవాలని ప్రార్థిద్దాం.
ఇక్కడ ముంబయి జట్టుకి ఆర్బీ ఆటగాళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ అభిమానులు కూడా సపోర్ట్ చేస్తారు అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. శనివారం జరగనున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీపై ముంబయి జట్టు గెలవాలని ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు అభిమానులు కోరుకుంటున్నారు.. ఈ మ్యాచ్ లో ముంబై గెలిస్తే కనుక ఆర్సీబీ దర్జాగా ప్లే ఆప్స్ కు చేరుకుంటుంది.
Related News
Centuries In IPL: ఐపీఎల్లో సెంచరీల మోత.. ఇప్పటివరకు ఆరు శతకాలు.. బట్లరే రెండు బాదాడు..!
ఈ ఏడాది ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదు చేసే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోర్లను నమోదు చేసింది.