HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Telugu Ipl Players Shine In 2025 Auction 5 Out Of 18 Make The Cut

Telugu IPL Players: వేలంలో అమ్ముడుపోయిన తెలుగు కుర్రాళ్ళు!

గుంటూరుకు చెందిన 20 ఏళ్ల షేక్ రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్‌ కనీస ధర 30 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.గత సీజన్‌లోనూ రషీద్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

  • By Naresh Kumar Published Date - 05:40 PM, Wed - 27 November 24
  • daily-hunt
IPL 2025 Final
IPL 2025 Final

Telugu IPL Players: 2 రోజుల పాటు జరిగిన ఈ వేలంలో (Telugu IPL Players) 10 ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 2 రోజుల్లో 639.15 కోట్లు ఖర్చు చేశాయి. వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. హైదరాబాద్ కేవలం 20 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. తొలిరోజు వేలంలో 72 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇందులో 24 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రెండో రోజు 10 జట్లు 72 మంది ఆటగాళ్లపై 467.95 కోట్లు ఖర్చు చేశాయి.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. వేలం మొదటి రోజు లక్నో సూపర్ జెయింట్స్ అతడిని 27 కోట్లకు కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పంత్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే లక్నో భారీ ధరకు అతడిని దక్కించుకుంది. వేలంలో శ్రేయాస్ అయ్యర్ కూడా ధనవంతుడయ్యాడు. 26 కోట్ల 75 లక్షల బిడ్‌తో శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ చేర్చుకుంది. వెంకటేష్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 23.75 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పాటు యుజువేంద్ర చాహల్‌పై పంజాబ్ రూ.18 కోట్లు ఖర్చు చేసింది. మెగావేలంలో 13 ఏళ్ళ కుర్రాడు అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బిహార్‌కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ను రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్లు చెల్లించి దక్కించుకుంది. ఇదిలా ఉండగా వేలంలో తెలుగు కురాళ్ళ సత్తా చాటారు.

Also Read: Billionaire To Monk : ప్రపంచంలోనే సంపన్న సన్యాసి.. రూ.40వేల కోట్ల ఆస్తిని వదిలేశాడు

గుంటూరుకు చెందిన 20 ఏళ్ల షేక్ రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్‌ కనీస ధర 30 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.గత సీజన్‌లోనూ రషీద్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే గత వేలంలో రషీద్ని 20 లక్షల కనీస ధరకు చెన్నై సొంతం చేసుకుంది. అయితే తుది జట్టులో ఆడే అవకాశం రాకపోయినా, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా స్టన్నింగ్ క్యాచ్ అందుకుని అందరి దృష్టి ఆకర్షించాడు. విశాఖపట్నంకు చెందిన 24 ఏళ్ల పైల అవినాష్‌ను 30 లక్షల కనీస ధరతో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ కుర్రాడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో సెంచరీతో అలరించాడు. కాకినాడ ఫాస్ట్ బౌలర్‌ సత్యనారాయణ రాజు‌ను ముంబై ఇండియన్స్ 30 లక్షలు వెచ్చించి దక్కించుకుంది.

ముంబై జట్టులో ఉన్న తెలుగు తేజం తిలక్ వర్మతో కలిసి సత్యనారాయణ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం కుర్రాడు‌ త్రిపురణ విజయ్‌ను 30 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది.మొత్తంగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌తో సహా మనోళ్లు అయిదుగురు మెగావేలంలో అమ్ముడుపోయారు. సిరాజ్ కోసం గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్లు ఖర్చుపెట్టింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2025
  • ipl auction
  • Mohammad Siraj
  • Paila Avinash (Visakhapatnam)
  • Satyanarayana Raju (Kakinada)
  • Sheikh Rashid (Guntur)
  • Telugu IPL Players
  • Tilak Varma
  • Tripurana Vijay (Srikakulam)

Related News

Virat Kohli

Virat Kohli: ఆర్సీబీకి గుడ్ బై చెప్ప‌నున్న విరాట్ కోహ్లీ?!

టీమ్ ఇండియా త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడతారు. వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియాలో విరాట్ కోహ్లీ కూడా ఎంపికయ్యాడు.

    Latest News

    • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd