HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Telugu Ipl Players Shine In 2025 Auction 5 Out Of 18 Make The Cut

Telugu IPL Players: వేలంలో అమ్ముడుపోయిన తెలుగు కుర్రాళ్ళు!

గుంటూరుకు చెందిన 20 ఏళ్ల షేక్ రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్‌ కనీస ధర 30 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.గత సీజన్‌లోనూ రషీద్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

  • By Naresh Kumar Published Date - 05:40 PM, Wed - 27 November 24
  • daily-hunt
IPL 2025 Final
IPL 2025 Final

Telugu IPL Players: 2 రోజుల పాటు జరిగిన ఈ వేలంలో (Telugu IPL Players) 10 ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 2 రోజుల్లో 639.15 కోట్లు ఖర్చు చేశాయి. వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. హైదరాబాద్ కేవలం 20 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. తొలిరోజు వేలంలో 72 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇందులో 24 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రెండో రోజు 10 జట్లు 72 మంది ఆటగాళ్లపై 467.95 కోట్లు ఖర్చు చేశాయి.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. వేలం మొదటి రోజు లక్నో సూపర్ జెయింట్స్ అతడిని 27 కోట్లకు కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పంత్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే లక్నో భారీ ధరకు అతడిని దక్కించుకుంది. వేలంలో శ్రేయాస్ అయ్యర్ కూడా ధనవంతుడయ్యాడు. 26 కోట్ల 75 లక్షల బిడ్‌తో శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ చేర్చుకుంది. వెంకటేష్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 23.75 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పాటు యుజువేంద్ర చాహల్‌పై పంజాబ్ రూ.18 కోట్లు ఖర్చు చేసింది. మెగావేలంలో 13 ఏళ్ళ కుర్రాడు అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బిహార్‌కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ను రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్లు చెల్లించి దక్కించుకుంది. ఇదిలా ఉండగా వేలంలో తెలుగు కురాళ్ళ సత్తా చాటారు.

Also Read: Billionaire To Monk : ప్రపంచంలోనే సంపన్న సన్యాసి.. రూ.40వేల కోట్ల ఆస్తిని వదిలేశాడు

గుంటూరుకు చెందిన 20 ఏళ్ల షేక్ రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్‌ కనీస ధర 30 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.గత సీజన్‌లోనూ రషీద్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే గత వేలంలో రషీద్ని 20 లక్షల కనీస ధరకు చెన్నై సొంతం చేసుకుంది. అయితే తుది జట్టులో ఆడే అవకాశం రాకపోయినా, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా స్టన్నింగ్ క్యాచ్ అందుకుని అందరి దృష్టి ఆకర్షించాడు. విశాఖపట్నంకు చెందిన 24 ఏళ్ల పైల అవినాష్‌ను 30 లక్షల కనీస ధరతో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ కుర్రాడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో సెంచరీతో అలరించాడు. కాకినాడ ఫాస్ట్ బౌలర్‌ సత్యనారాయణ రాజు‌ను ముంబై ఇండియన్స్ 30 లక్షలు వెచ్చించి దక్కించుకుంది.

ముంబై జట్టులో ఉన్న తెలుగు తేజం తిలక్ వర్మతో కలిసి సత్యనారాయణ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం కుర్రాడు‌ త్రిపురణ విజయ్‌ను 30 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది.మొత్తంగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌తో సహా మనోళ్లు అయిదుగురు మెగావేలంలో అమ్ముడుపోయారు. సిరాజ్ కోసం గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్లు ఖర్చుపెట్టింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2025
  • ipl auction
  • Mohammad Siraj
  • Paila Avinash (Visakhapatnam)
  • Satyanarayana Raju (Kakinada)
  • Sheikh Rashid (Guntur)
  • Telugu IPL Players
  • Tilak Varma
  • Tripurana Vijay (Srikakulam)

Related News

11 Sixes Off 12 Balls

11 Sixes Off 12 Balls: క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. 12 బంతుల్లో 11 సిక్సులు, వీడియో వైర‌ల్‌!

సల్మాన్ నిజార్ తన 86 పరుగుల ఇన్నింగ్స్‌లో మొత్తం 12 సిక్సర్లు కొట్టాడు. కేరళ క్రికెట్ లీగ్ 2025 సీజన్‌లో అతను ఇలా అద్భుతంగా రాణించడం ఇది మొదటిసారి కాదు.

  • Stampede incident... RCB Rs. 25 lakh compensation to each family

    Bangalore : తొక్కిసలాట ఘటన… ఒక్కో కుటుంబానికి ఆర్సీబీ రూ. 25 లక్షల పరిహారం

Latest News

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

  • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd