Mumbai Indians: ముంబై ఇండియన్స్కు బ్యాడ్ న్యూస్.. మొదటి రెండు మ్యాచ్లకు స్టార్ ప్లేయర్ దూరం..?
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు బ్యాడ్ న్యూస్ వస్తోంది. టీ20 నంబర్-1 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికీ నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడని తెలిసిందే.
- By Gopichand Published Date - 08:39 AM, Wed - 13 March 24
Mumbai Indians: IPL 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభానికి ఇప్పుడు 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రపంచంలోని ఈ అతిపెద్ద క్రికెట్ లీగ్లో క్రికెట్ ప్రపంచంలోని స్టార్ ప్లేయర్స్ అద్భుతాలు సృష్టిస్తారు. అందుకే ఈ మెగా ఈవెంట్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. IPL 2024 భారత ఆటగాళ్లకు కూడా చాలా ముఖ్యమైనది..? ఎందుకంటే ఈ టోర్నమెంట్లో వారి ప్రదర్శన ఆధారంగా జూన్లో ప్రారంభమయ్యే ICC T20 ప్రపంచ కప్కు టీమిండియా జట్టుకు ఎంపిక చేయబడతారు.
మరోవైపు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు బ్యాడ్ న్యూస్ వస్తోంది. టీ20 నంబర్-1 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికీ నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడని తెలిసిందే. అతనికి ఇంకా ఫిట్నెస్ సర్టిఫికెట్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఐపీఎల్ ఆడుతాడా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
వాస్తవానికి IPL 2024లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ రన్నరప్ గుజరాత్ టైటాన్స్తో మార్చి 24 నుండి తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. కానీ, ముంబై ఇండియన్స్కు బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ప్రపంచ నంబర్ 1 T20 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ NCAలో పూర్తి ఫిట్నెస్ని పొందడానికి ఇంకా తీవ్రంగా కృషి చేస్తున్నాడు.
Also Read: China Explosion: చైనాలో భారీ పేలుడు.. బిల్డింగ్ పూర్తిగా ధ్వంసం.. వీడియో..!
మొదటి రెండు మ్యాచ్ల్లో ఆడేందుకు అనుమతిస్తారా లేదా?
మీడియా కథనాల ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ పునరావాసం సరైన మార్గంలో ఉంది. అతను ఖచ్చితంగా IPL 2024లో తిరిగి వస్తాడు. కానీ మార్చి 24న గుజరాత్ టైటాన్స్తో, మార్చి 27న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే తొలి రెండు మ్యాచ్ల్లో ఆడేందుకు ఎన్సీఏ వైద్య బృందం అనుమతి ఇస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
We’re now on WhatsApp : Click to Join
ఫిట్గా ఉండటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు
సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టా స్టోరీని పరిశీలిస్తే.. అతను చాలా బలం, కండిషనింగ్ శిక్షణలో ఉన్నాడు. అయితే అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఓ మూలం ప్రకారం.. ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్కు ఇంకా 12 రోజులు మిగిలి ఉన్నాయి. కానీ తొలి మ్యాచ్కు ముందు సూర్య ఫిట్గా ఉండేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
Related News
MS Dhoni 150 Catches: ఐపీఎల్లో 150 క్యాచ్లు పట్టిన తొలి వికెట్కీపర్గా ధోనీ రికార్డు
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సిమ్రంజిత్ సింగ్ బంతికి పంజాబ్ కింగ్స్ ఆటాగాడు జితేష్ శర్మ క్యాచ్ పట్టి ధోనీ ప్రపంచ రికార్డ్ సాధించాడు. ఈ మ్యాచ్ లో శర్మ క్యాచ్ ద్వారా ఐపీఎల్లో 150 క్యాచ్లు పట్టిన తొలి వికెట్కీపర్గా ధోనీ రికార్డు సృష్టించాడు.