Ganguly- Kohli: కోహ్లీ, గంగూలీకి మధ్య ఏం జరుగుతుంది..? ఇన్స్టాగ్రామ్లో కోహ్లీని అన్ఫాలో చేసిన దాదా..!
భారత జట్టు మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), విరాట్ కోహ్లీ (Virat Kohli)ల మధ్య వాగ్వాదం ముదురుతోంది.
- By Gopichand Published Date - 10:05 AM, Wed - 19 April 23
భారత జట్టు మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), విరాట్ కోహ్లీ (Virat Kohli)ల మధ్య వాగ్వాదం ముదురుతోంది. గత వారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు బయటపడ్డాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాట్స్మెన్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మెంటార్, బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసినట్లు సమాచారం. ఇటీవల బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ఆ సమయంలో సౌరవ్ గంగూలీతో కోహ్లీ కరచాలనం చేయకుండా వెళ్లిపోయాడు. ఈ వీడియోలో మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఒకరితో ఒకరు కరచాలనం చేస్తున్నప్పుడు కోహ్లీ మాత్రం గంగూలీ దగ్గరకి వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.
సోమవారం ఇన్స్టాగ్రామ్లో సౌరవ్ గంగూలీని అన్ఫాలో చేయడం ద్వారా విరాట్ కోహ్లీ మంటలకు ఆజ్యం పోశాడు. గంగూలీ కూడా ఇన్స్టాగ్రామ్లో టిట్ ఫర్ టాట్ అనే సామెతను అనుసరించి కోహ్లీని అన్ఫాలో చేశాడు. తనకు, కోహ్లీకి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదని గంగూలీ ధృవీకరించాడు. భారత జట్టు కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మధ్య వివాదం మొదలైంది. కెప్టెన్సీ నుంచి తనను తొలగించే విషయం తనకు తెలియదని కోహ్లీ గతంలో చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ను 1-2తో భారత్ కోల్పోయిన తర్వాత కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. గంగూలీ, కోహ్లీ మధ్య వివాదం భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read: Virender Sehwag: సీఎస్కే బౌలర్లపై సెహ్వాగ్ అసంతృప్తి.. అలా చేస్తే కెప్టెన్ ధోనీపై నిషేధం..!
అక్టోబర్ 2021లో కోహ్లీ భారత T20I కెప్టెన్గా వైదొలిగిన తర్వాత అతను ODI కెప్టెన్గా కూడా తొలగించబడ్డాడు. అయితే అప్పుడు బీసీసీఐ బోర్డు నిర్ణయం ఛైర్మన్ గా ఉన్న గంగూలీకి ఈ విషయం తనకు కొన్ని గంటల ముందే తెలిసిందని చెప్పడంతో అసలు వివాదం మొదలైంది. మరోవైపు తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ఎలాంటి తప్పు చేయలేదని, చర్చల ప్రక్రియ ద్వారానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Related News
Kohli: కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ నిజంగానే క్వాలిఫై అవుతుందా?
Kohli: ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నప్పటి నుంచి ప్లేఆఫ్స్లో అవకాశం దక్కడం వరకు బెంగళూరుకు చెందిన ఆ జట్టు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, అన్ని అడ్డంకులను అధిగమించి ఆర్సీబీ ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందా? అది జరగాలంటే సీఎస్కేను భారీ తేడాతో ఓడించాలి. ఫలితంగా గ్�